మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఫ్యాన్స్ కి పూనకాలే వస్తాయి. ఆయన పేరు చెబితేనే వారు పరవశిస్తారు. చిరంజీవి ఇప్పటికీ సినిమాల్లో చేస్తున్నారు అంటే తనకు గల అపరిమితమైన ఫ్యాన్స్ ని అలరించడానికే. ఇక చిరంజీవి రీ ఎంట్రీ తరువాత చేసిన ఖైదీ నంబర్ 150 సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులే లేవు.

ఆ తరువాత వచ్చిన సైరా మూవీ క్లాసిక్ గా నిలిచింది. ఇపుడు ఆచార్య మూవీతో మెగాస్టార్ రంగంలోకి దూకాడు. ఈ సినిమా సమ్మర్ కి వెండి తెరను తాకుతుంది అంటున్నారు. ఈ మూవీ తరువాత మరో రెండు సినిమాలను చిరంజీవి పట్టాలెక్కించారు. ఆ రెండూ కూడా రీమేక్ మూవీలే. ఇందులో వేదాళం మూవీకి మెహర్ రమేష్ డైరెక్టర్ అయితే. లూసీఫర్ మూవీకి వినాయక్ అనుకుంటున్నారు.

అయితే  ఈ మూవీ ఒరిజినల్ లో హీరో మోహన్ లాల్. ఆయనకు ఈ సినిమాలో జంట లేదు. అంటే హీరోయిన్ లేకుండా సోలోగా ఆయన పాత్ర సాగుతుంది. మరి ఈ మూవీ విషయంలో మెగాస్టార్ ముచ్చట పడుతూంటే  ఫ్యాన్స్ మాత్రం తెగ ఫీల్ అవుతున్నారుట. చిరంజీవి అంటేనే హీరోయిన్ తో డ్యూయెట్లు, స్టెప్పులు కచ్చితంగా ఉండాలన్నది మెగా ఫ్యాన్స్ రూల్.

అలాంటిది సోలోగా తమ హీరో నటిస్తే ఇక మూవీ చేయడం ఎందుకు అని ఫ్యాన్స్ అంటున్నారు. తాము చిరంజీవిని అలా చూడలేమని కూడా చెప్పేస్తున్నారు. మరి తెలుగు నేటివిటీకి తగినట్లుగా కధలో మార్పులు చేస్తున్న చిత్ర యూనిట్ ఎలాగోలా హీరోయిన్ ని కూడా కధలో ఉంచేలా చూస్తారా అన్నది చర్చగా ఉందిట. మరి నిజంగా చిరంజీవి హీరోయిన్ లేకుండా చేస్తే మంచిదే అని ఆయన నటనను ఇష్టపడేవారు అంటున్నారు. కానీ ఫ్యాన్స్ ఊరుకోవడంలేదే. చూడాలి ఏం జరుగుతుందో. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ మీదకు వస్తుందని టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: