ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సినిమా పరిశ్రమలో కొన్ని కాంబినేషన్ లు ఉంటాయి. వాటిని ఎన్నటికీ మరచిపోలేము. చిరకాలం అలా గుర్తుండిపోతాయి. అలాంటి కాంబినేషన్ లో కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్ కాంబినేషన్  ఎన్నటికి గుర్తుండిపోతుంది. ఈ కాంబినేషన్ ని ప్రేక్షకులు ఎప్పటికీ మరువలేరు. ఇప్పటికీ టీవీలో వీరిద్దరు కలిసి నటించిన సన్నివేశాలు వస్తుంటే చూస్తూ నవ్వుకుంటారు ప్రేక్షకులు. అంతగా అందరినీ వీరు మెప్పించారు ఇంకా ఎంటర్టైన్ చేశారు.


డైరెక్టర్ లు అయితే  వీరికోసం సెపరేట్ గా ట్రాక్ లు రాసుకునేవారు. ఆ తరువాత బాబు మోహన్ రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో వీరి కలయికలో ఇంకా  సినిమాలు రావటం ఆగిపోయాయి. కోటా శ్రీనివాస్ రావు కూడా తన వయసుకి తగ్గ పాత్రలు వేసుకుంటూ కొన్నాళ్లు పరిశ్రమలో రాణించారు.ఇక పోతే చాలా ఏళ్ల  తరువాత వీరిద్దరూ కలిసి నటుడు అలీ నిర్వహిస్తున్న షో లో కనిపించారు . తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేయటం జరిగింది. ప్రోమో మొత్తం కూడా చాలా వినోదాత్మకంగా వుంది. బాబు మోహన్ పై కోటా పంచ్ లు వేయడం, మధ్యలో అలీపై కూడా  ఒకట్రెండు కౌంటర్లు వెయ్యడం ఇలా చాలా, సరదాగా సాగిపోయింది. అయితే చివర్లో కోటా తమ జీవితంలో జరిగిన విషాద సంఘటనను గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకున్నారు.


బాబు మోహన్, కోటా  శ్రీనివాస్ గారి కుమారులు రోడ్డు ప్రమాదంలో మరణించారు.ఇదే విషయాన్ని ప్రస్తావించిన కోటా శ్రీనివాస్ రావు .. బాబు మోహన్ కి ఉద్దేశిస్తూ.. ‘వాడికి, నాకూ ఓ కనెక్షన్ ఉంది.. వాడికి అబ్బాయి పోయాడు, నాకూ అబ్బాయి పోయాడు. కాకపోతే వాడికి కొంచెం అదృష్టం ఏంటంటే.. ఇంకో కొడుకు ఉన్నాడు. నా ఒక్కగానొక్క కొడుకు పోవడం’ అంటూ ఎమోషనల్ అయి ఏడ్చేశారు. ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంయాదృచ్ఛికం అంటూ బాబు మోహన్ కూడా కన్నీరు పెట్టుకున్నారు.ఇలా వీరి బాధను చూసిన సాటి ప్రేక్షకులు కూడా కన్నీరు మున్నీరవుతున్నారు.ఇలాంటి మరెన్నో విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: