ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...రిచా గంగోపాధ్యాయ... శేఖర్ కమ్ముల, దగ్గుబాటి రానా కలయికలో వచ్చిన  ‘లీడర్’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది ఈ హాట్ బ్యూటీ..ఈ సినిమా హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి బాగానే అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత  విక్టరీ వెంకటేష్ తో నాగవల్లి, రవి తేజతో వరుసగా రెండు సినిమాలు మిరపరాయ్, సారొచ్చారు సినిమాలు చేసింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో  మిర్చి,కింగ్ నాగార్జున తో  భాయ్ సినిమా చేసింది. ఈ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈమె కెరీర్ లో ఒకటో రెండో మినహాయించి మిగతావి అన్ని మంచి హిట్స్ అయినా కానీ ఎందుకో  సడెన్‌గా సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. అయితే దానికి కారణం  రిచా అమెరికా వెళ్లిపోయి ఎంబీఏ చేసింది.
ఇటీవలే తన క్లాస్‌మేట్‌ని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. అయితే రిచా సడెన్‌గా సినిమా ఇండస్ట్రీకి దూరం కావడంపై అప్పట్లో రకరకాల వార్తలొచ్చాయి.తనకు చిన్నప్పటి నుంచి ఎంబీఏ చేయాలని కోరిక ఉండేదని, అందుకే సినిమాలు వదిలేసి అమెరికాకు వెళ్లిపోయానని ఈ హాట్ హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ తెలిపింది. ఇదే విషయంపై ఈ హాట్ బ్యూటీ  తాజాగా స్పందించింది.

రిచా మాట్లాడుతూ ‘మార్కెటింగ్‌లో ఎంబీఏ చేయాలనేది నా చిన్ననాటి కల. ఆ ఛాన్స్ రావడంతో సినిమా ఇండస్ట్రీని వదిలేసి అమెరికా వెళ్లిపోయాను. చాలామంది సినిమాలకు దూరం కావొద్దని సలహాలు ఇచ్చినా.. నా మనసు ఎంబీఏ వైపే మొగ్గు చూపింది. సినిమాలు వదిలేసి చదువుకోవడమే సరైన నిర్ణయమని భావించా. చదువు పూర్తి కాగానే నా క్లాస్‌మేట్‌నే పెళ్లి చేసుకున్నా.


సినిమా ఇండస్ట్రీని వదిలేసినందుకు నాకేమీ బాధలేదు. ప్రస్తుతం నా వైవాహిక జీవితం సాఫీగా సాగుతోంది’ అని చెప్పుకొచ్చింది రిచా.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: