ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక పేట్రియాటిక్ మూవీ రౌద్రం రణం రుధిరం. మెగా నందమూరి హీరోలు అయిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర పోషిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. తొలిసారిగా వీరిద్దరూ కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. బాలీవుడ్ నటి ఆలియా భట్, హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తుండగా కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇక ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. సముద్ర ఖని, శ్రియ శరణ్, అజయ్ దేవగన్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవి తరువాత రిలీజ్ చేయనున్నట్లు టాక్. అంతకముందు బాహుబలి రెండు భాగాల విజయాలతో ఎంతో గొప్ప పేరు దక్కించుకున్న రాజమౌళి, ఈ ఆర్ఆర్ఆర్ సినిమాని వాటిని మించేలా ఎంతో భారీగా తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే, మొదట ప్రభాస్ తో రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమా మంచి హిట్ ని అందుకుంది.

ఇక ఇటీవల ఆయనతో బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాలు తీసి సక్సెస్ కొట్టిన రాజమౌళి, ప్రస్తుతం తీస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆయనతో ఒక ప్రత్యేక పాత్ర చేయిస్తున్నట్లు టాక్. కేవలం సినిమాలో కొన్ని క్షణాలు మాత్రమే ప్రభాస్ కనపడతారాని, అయినప్పటికీ ఈ పాత్ర ప్రేక్షకుల మది లో ఎంతో నిలిచిపోతుందని అంటున్నారు. మరోవైపు రాజమౌళి తో ఉన్న ప్రత్యేక అనుబంధం కారణంగానే ఈ సినిమాలో ప్రభాస్ ప్రత్యేక పాత్ర చేస్తున్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు గాని, ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మాత్రం, ఇది నిజంగా మెగా నందమూరి ఫ్యాన్స్ తో పాటు రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి కూడా మంచి పండుగ వార్త అని చెప్పకతప్పదు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: