స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా వస్తుంది పుష్ప. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో విలన్ గా ఒకరు ఇద్దరు కాదు తొమ్మిది మందిని తీసుకుంటున్నారని తెలుస్తుంది.

అదేంటి ఒక్క హీరోకి తొమ్మిది మంది విలన్లా అని అనుకోవచ్చు. రంగస్థలం తర్వాత సుకుమార్ హిట్టు కొడితే దాని రీ సౌండ్ ఎలా ఉంటుందో తెలిసిందే. ఈ క్రమంలో పుష్ప సినిమాను కూడా భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో మెయిన్ విలన్ తో పాటుగా చిన్నా చితకా విలన్లు అందరు కలిపి తొమ్మిది మంది ఉంటారని తెలుస్తుంది. ఈ విలనిజం ఓ రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది. పుష్ప సినిమాను మెగా, అల్లు ఫ్యాన్స్ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.

చూస్తుంటే సుకుమార్ భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ కు బాలీవుడ్ లో ఎలాగు క్రేజ్ ఉంది. అందుకే ఈ సినిమాతో అక్కడ కూడా పాగా వేయాలన్ చూస్తున్నాడు. చూస్తుంటే పుష్ప బాహుబలి రేంజ్ మూవీగా ప్లాన్ చేస్తున్నట్టు ఉన్నారని అనిపిస్తుంది. పుష్ప సినిమాలో సుకుమార్ చాలా సర్ ప్రైజెస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి సుక్కు, బన్నీ పుష్ప ఎలా ఉంటుందో చూడాలి.                                                                         

మరింత సమాచారం తెలుసుకోండి: