త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అలవైకుంఠపురం' సినిమా లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా 'పుష్ప'.. సుకుమార్సినిమా కి దర్శకుడు..ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగిపోయే ఈ సినిమా  వీరి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూడో సినిమా కాగా మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలే పెట్టుకున్నారు.. రంగస్థలం లాంటి హిట్ కొట్టిన సుకుమార్ కి ఇది ఒక అగ్ని పరీక్ష ల మారిందని చెప్పొచ్చు.. వీరి కాంబోలో ఆర్య ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్ కాగా ఈ సినిమా పై అంచనాలు కూడా ఆ రేంజ్ లో ఉన్నాయి.

నిజానికి అన్ని బాగుంటే ఇప్పటికే మహేష్ బాబు తో సినిమా చేసి రిలీజ్ చేయాల్సి ఉండేది. కానీ విధి ఆడిన నాటకంలో మహేష్ సుకుమార్ కి హ్యాండ్ ఇవ్వడం సుకుమార్ తనకు అచ్చోచ్చిన హీరో అయిన అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సినిమా కి విలన్ సమస్య ప్రధానంగా ఉంది అని చెప్పొచ్చు.. మొదటినుంచి అనుకున్నట్లు సినిమా విలన్ పై రోజు కో పేరు వినిపిస్తుంది..  ఇప్పటికే ఈ సినిమా కి విజయ్ సేతుపతి ని విలన్ గా ఫిక్స్ చేయగా డేట్ సమస్య వల్ల ఆయన ఈ సినిమా కి దూరమయ్యారు..

ఆ తర్వాత చాలామంది పేర్లు వచ్చాయి కానీ ఎవరు సెట్ కాలేదు.. ఇటీవలే షూటింగ్ కి వెళ్లిన ఈ చిత్ర బృందం ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. సీనియర్ కమెడియన్ సునీల్ ని ఇందులో ఓ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కోసం తీసుకున్నారట. రావు రమేష్ - ముఖేష్ రుషి లను కూడా విలన్స్ గా తీసుకున్నారట.త్వరలోనే ప్రధాన నటీనటులను 'పుష్ప' టీమ్ అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా మన్యం ప్రాంతం మారేడుమిల్లి అభయారణ్యంలో ఈ సినిమా షూటింగ్ షెరవేగంగా జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: