బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా మూవీ రాదే. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. దిశా పటాని, జాక్వలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ లు గా నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ కావాల్సి ఉంది. అన్ని సినిమాల లాగే అలాగే ఈ సినిమా మీద కూడా కరోనా ఎఫెక్ట్ గట్టిగానే పడింది. దీంతో ఈ సినిమాని వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్. 



అయితే తాజా సమాచారం మేరకు ఈ సినిమాకు ఏకంగా 300 కోట్లను ఆఫర్ చేసిందంట ఒక ఒటీటీ సంస్థ. డైరెక్ట్ థియేటర్ రిలీజ్ లేకుండా సినిమా తమకు అమ్మేస్తే 300 కోట్లు ఇస్తామని ఆ ఆఫర్ సారాంశం. అయితే ఈ సినిమా హీరోగానే కాక నిర్మాతగా కూడా ఉన్న సల్మాన్ ఖాన్ ఈ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. 



తన లాంటి స్టార్ హీరో సినిమా కూడా ఇలా ఓ టి టి లో రిలీజ్ అయితే తర్వాత థియేటర్ లు ప్రమాదంలో పడే అవకాశం ఉందని భావించిన ఆయన అందుకు ససేమిరా అన్నాడు అని అంటున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లు ఓపెన్ అయ్యాక రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు మేకర్స్. మేఘా ఆకాష్, జాకీ ష్రాఫ్, రణ దీప్ హుడా లాంటి స్టార్ నటులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. చూడాలి ఈ సినిమా ఎక్కడ ఎలా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: