అయితే టాలీవుడ్ హీరోలంతా కూడా పాన్ ఇండియా ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ తో రాం చరణ్, ఎన్.టి.ఆర్ ఇద్దరు నేషనల్ వైడ్ గా వస్తున్నారు. ఇక అల్లు అర్జున్ పుష్ప కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ ఆల్రెడీ సినిమా చేస్తే పాన్ ఇండియా అని ఫిక్స్ అయ్యారు. ఇక మిగిలింది మహేష్ మాత్రమే. మహేష్ పాన్ ఇండియా మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మహేష్ తెలుగు సినిమాలు చూసే బాలీవుడ్ ఫ్యాన్స్ వావ్ అంటున్నారు.
ఇక మహేష్ దృష్టి పెట్టి పాన్ ఇండియా రేంజ్ సినిమాలు తీయడం మొదలుపెడితే మాత్రం దుమ్ము దుమారమే అని చెప్పొచ్చు. అది రాజమౌళి సినిమాతోనే సాధ్యమవుతుందని తెలుస్తున్నా.. జక్కన్న మూవీ తర్వాత మహేష్ కూడా సినిమా చేస్తే పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తాడని అంటున్నారు. మరి మహేష్ ఆలోచన ఎలా ఉందో చూడాలి. ఇప్పటికే నేషనల్ వైడ్ యాడ్స్ చేస్తున్న మహేష్ సినిమాలు కూడా చేస్తే ఆ లెక్క వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.