బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ సినిమా దెబ్బకు ఆయన ప్యాన్ ఇండియన్ స్టార్ కాదు ఏకంగా ప్యాన్ వరల్డ్ స్టార్ గా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత ఆయన చేస్తున్న ప్రతి సినిమా మార్కెట్ ని భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అలానే సాహో అనే సినిమా తీస్తే అది మాత్రం గట్టి దెబ్బ వేసింది. దీంతో తర్వాత ఆయన రాధే శ్యాం అనే సినిమాను చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు. సాహో సినిమా అనుభవంతో ఈ సినిమా చాలా జాగ్రత్తగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం మూడు సినిమాలు లైన్ లో ఉంచాడు, అందులో రాధే శ్యాం షూటింగ్ చివరి దశకు చేరుకుంది కూడా. 



ఇక ఈ సినిమా తర్వాత మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉన్నా దాని కంటే ముందు మరో సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. నాగ్ అశ్విన్ సినిమా ప్రకటించిన తర్వాత కొద్ది రోజులకు ప్రభాస్ హిందీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ అనే సినిమాని అనౌన్స్ చేశాడు . అందుతున్న సమాచారం మేరకు నాగ అశ్విన్ సినిమా కంటే ముందు ఈ బాలీవుడ్ సినిమాలను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. దానికి నిదర్శనంగా అశ్విన్ సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేయకముందే బాలీవుడ్ సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. 



ఈ లెక్కన తీసుకుంటే ప్రభాస్ డేట్స్ మరో రెండేళ్ల వరకు కాళీ లేవు అయినా సరే టాలీవుడ్ కి చెందిన బడా ప్రొడ్యూసర్లు, ప్రొడక్షన్ హౌస్ ల అధినేతలు ప్రభాస్ తో ఒక సినిమా చేయలాని ఆయన వెంట పడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయనకు సినిమా చేసిన వాళ్ళు, ఒక్క సినిమా అయినా చేయాలని భావిస్తున్న కొత్త వాళ్లు కూడా ప్రభాస్ వెంట ఇప్పుడు తమ మనుషులను తిరుగుతున్నారట. ఒక్క సినిమా అయినా తనతో చేయాలని కొత్త వారు ప్రయత్నాలు చేస్తుంటే మరో సినిమా చేసి తమకు హిట్ ఇవ్వాలని పాత పాత నిర్మాతలు ప్రభాస్ ను కోరుతున్నారు. అందులో దిల్ రాజు మొదలు అల్లు అరవింద్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు అలాగే 14 రీల్స్ ఎంటర్టైన్ మెంట్ వారు కూడా ఉన్నారని సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: