ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్స్ లో నెంబర్ వన్ స్థానానికి గట్టి పోటీ రష్మిక పూజ హెగ్డేల మధ్య నడుస్తోంది. వీరిద్దరూ తప్ప మిగిలిన హీరోయిన్స్ అందరు తమ పారితోషికాన్ని తగ్గించుకుని నిర్మాతలకు సహకరిస్తూ ఉంటే రష్మిక పూజ లు మాత్రం తమ పారితోషికాన్ని నిర్మాతల బాధలను అర్ధం చేసుకోకుండా వారికి చుక్కలు చూపెడుతున్నారు.


నిరంతరం సోషల్ మీడియాలో సందడి చేసే రష్మిక ఈమధ్య తెలియచేసిన తన ఆహారపు అలవాట్లు తెలుసుకుని ఆమె అభిమానులు కూడ షాక్ అవుతున్నారు. ఆమధ్య హీరో నితిన్ రష్మిక కుక్క బిస్కెట్స్ తింటుంది అంటు చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈమె మరో అడుగు ముందుకు వేసి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన విచిత్ర ఆహారపు అలవాట్లను బయటపెట్టింది.


ఈ కన్నడ బ్యూటీ తాను భోజనం చేసేడప్పుడు అన్నం కూర పప్పు పెరుగు సాంబారు అన్నీ కలిపేసి ఒకేసారి తింటుందట. అంతేకాదు రష్మికకు పంది మాంసం అంటే చాలా ఇష్టం అంట. నిజానికి తన ప్రాంతంలో ఇది సాంప్రదాయ వంటకం అని అంటోంది. కాల్చిన పంది మాంసం తిన్న తరువాత 2 పెగ్గులు వైన్ తాగితే స్వర్గం చూడవచ్చని చెబుతోంది.


అంతేకాదు ప్రతి వ్యక్తి రాత్రి భోజనం చేసిన తరువాత రెండు పెగ్గుల వైన్ తాగితే గుండెకు సంబంధించిన ఎటువంటి సమస్యలు రావు అంటూ ఈమె తన అభిమానులకు సలహాలు ఇచ్చింది. అయితే ఇప్పటికీ మనదేశంలో 33 కోట్ల మంది ప్రతిరోజు ఒక పూట భోజనం చేస్తున్న పరిస్థితులలో రష్మిక సలహాలను ఆచరించి ఆరోగ్యవంతులు కావడం కష్టమైన పని. ప్రస్తుతం ఈమెకు కొనసాగుతున్న ఈ మ్యానియా మరికొంత కాలం కొనసాగే ఆస్కారం ఉంది. బన్నీ తో నటిస్తున్న ‘పుష్ప’ మూవీ కూడ ఊహించిన విధంగా బ్లాక్ బష్టర్ హిట్ అయితే రష్మిక టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ అవడం ఖాయం..

మరింత సమాచారం తెలుసుకోండి: