తమిళ నటుడు సూపర్ స్టార్ విజయ్ కు తమిళ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమా అంటేనే అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటారు. ఈ మధ్యకాలంలో మరింత స్పీడ్ పెంచారు విజయ్... ఆయన నటించిన ప్రతి సినిమా కూడా 100 కోట్లు వసూలు చేస్తూ ఆయన ఫాలోయింగ్ కు నిదర్శనంగా మారింది. అలా ఆ రేంజ్ ను ఓ రేంజ్ లో సెట్ చేసుకున్న విజయ్ తమిళ సినిమా పరిశ్రమకే పరిమితం కానున్నారా అనే టాక్ ఈ మధ్య వినిపించింది. నిజానికి దానికి కారణం లేకపోలేదు.. అదేంటంటే..??? సూపర్ స్టార్ విజయ్ చిత్రాలకు ఇప్పటివరకు పాన్ ఇండియా క్రేజ్ పరిచయం అయ్యిందే లేదు.

తెలుగులో ఈ స్టార్ కు ఫ్యాన్స్ ఉన్నా.... సూపర్ హిట్స్ మాత్రం పొందనే లేదు. సూపర్ స్టార్ రజిని, సూర్య వంటి బడా స్టార్ హీరోల సినిమాల క్రేజ్ అటుంచితే.. కనీసం కార్తీ సినిమా రేంజ్ లో కూడా విజయ్ చిత్రాలు తెలుగులో అలరించలేకపోయాయి. దీనికి మరో కారణం కూడా ఉంది. ఎక్కువగా తమిళ ప్రేక్షకులకు మెచ్చే కంటెంట్ తో సినిమా తెరకెక్కించడం... తెలుగు ప్రేక్షకులకు నచ్చే ఫ్లేవర్ ను తగ్గించడం వలన ఈయన సినిమాలు తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు అని విమర్శలు ఉన్నాయ. అయితే ట్రెండ్ మార్చేందుకు రెడీ అయ్యాడు మన సూపర్ స్టార్ హీరో విజయ్. ఈ పాన్ ఇండియా ట్రయల్స్ చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మాస్టర్ సినిమాను కంప్లీట్ చేసిన విజయ్ తదుపరి ప్రాజెక్ట్ నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే.

 అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతుంది. కాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. తమిళ మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ అలాగే  పలువురు నటీ నటులను బాలీవుడ్ నుండి తీసుకోబోతున్నట్లుగా, బాలీవుడ్ నటీ నటులు ఉండటం వల్ల ఉత్తరాదిన సినిమాకు మంచి మార్కెట్ అవ్వడం ఖాయం. ఇదే సమయంలో యూనివర్శిల్ అప్పీల్ ఉన్న కథను తీసుకోవడంతో పాటు తమిళ ఫ్లేవర్ మరీ ఎక్కువ అవ్వకుండా కూడా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. దీంతో ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: