బిగ్ బాస్ అంటేనే బిగ్ రూల్స్, పైగా తెరపైకి రాని బిగ్ బాస్ అసలైన డైరెక్టర్ అని అంటారు. హౌజ్ నుంచి బయటకు వచ్చిన వారు చెబుతున్న మాటలను బట్టి చూస్తే హౌజ్ లో ఇరవై నాలుగు గంటల గేమ్ లో  అంతా తీసి చూపించేది గంట మాత్రమే. అది కూడా బిగ్ బాస్ డైరెక్షన్ ప్రకారమే అని అంటారు.

ఇక బిగ్ బాస్ లో ఎవరిని ఎత్తేయాలన్నా, దించేయాలన్నా కూడా బిగ్ బాస్ కెమెరాల చేతుల్లోనే ఉంటుందని అంటారు. అది నిజం కూడా.  ఒకరు అగ్రెసివ్ గా మాట్లాడింది స్క్రీన్ ముందు ప్రెజెంట్ చేస్తే వారు ఆడియన్స్ కి చెడ్డ అవుతారు. అదే సమయంలో ఆ వాదనకు ముందూ వెనకా ఏం జరిగాయన్నది కూడా చూపిస్తేనే అసలు పాయింట్ జనాల్లోకి వెళ్ళి సరిగ్గా జడ్జి చేయగలుగుతారు. అయితే బిగ్ బాస్ లో మాత్రం స్క్రీన్ షేర్ విషయంలో కొందరికి అన్యాయం జరిగిందని బయటకు వచ్చిన వారు చెప్పుకున్నారు.

ఇపుడు హౌజ్ లో ఏడుగురు ఉంటే బిగ్ బాస్ కెమెరా మాత్రం ఇద్దరు ముగ్గురునే తిప్పుతోంది అంటున్నారు. తాజాగా దయ్యం ఎపిసోడ్ హౌజ్ లో జరిగింది.  కన్సిషన్ రూం లోకి అరియానా, అవినాష్, మోనాల్, సోహెల్, అఖిల్ లను మాత్రమే పిలిచినట్లుగా చూపించి స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశారు. మరి హౌజ్ లో ఉన్న హారిక, అభిజిత్ ని అసలు చూపించలేదు. మరి వాళ్ళు వెళ్లినట్లా. లేనట్లా అని ఫ్యాన్స్ లో కూడా ఆసక్తి ఆరాటం ఉంది అంటున్నారు.

బిగ్ బాస్ లో అభిజిత్ కచ్చితంగా విన్నర్ అవుతాడు అని అంతా అనుకుంటున్న వేళ అందరి పేరేంట్స్ కూడా అతని పేరు సజెస్ట్ చేసిన వేళ అభిజిత్ స్క్రీన్ షేర్ బాగా తగ్గిపోతోందని కూడా ఫ్యాన్స్ గోల పెడుతున్నారుట. అయితే అభిజిత్ ఫిజికల్ టాస్కులు ఆడడు, దూరంగా ఉంటాడు. అందువల్లనే అతనికి స్క్రీన్ షేర్ దక్కడంలేదని కూడా అంటున్నారు. మొత్తానికి టాస్కులు ఆడిన వారు స్క్రీన్ షేర్ ఎక్కువగా వచ్చిన వారే గెలవాలని రూల్ కూడా లేదు. మైండ్ గేమ్ తోనూ విన్నర్ కావచ్చు చూడాలి మరి అభిజిత్ విన్నార్ అవుతాడా లేదా అన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: