తెలుగు చిత్ర పరిశ్రమకు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో భరత్ అనే నేను సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. ఈ భామ ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా హోదా సంపాదించుకుంది. ఆ సినిమా హిట్ తర్వాత.. రామ్ చ‌ర‌ణ్ సరసన 'విన‌య విధేయ రామ'లోనూ తన అంద చందాలతో బాగానే ప్రేక్షకుల్నీ ఆకర్షించింది. ఈ రెండు సినిమాల తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దూరంగానే ఉంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్‌లో ప్రస్తుతం వరస సినిమాలు చేస్తూ దుమ్ము దులిపేస్తుంది. ఇప్పటికే అక్కడ ఎమ్మెస్ ధోనీతో పాటు కబీర్ సింగ్ లాంటి సంచలన సినిమాలు చేసింది.

అయితే బాలీవుడ్‌ బోల్డ్ సెన్సేషన్ కియారా అద్వానీ మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. స్టార్ హీరోలు కూడా ఎందుకులే అనుకుంటుంటే.. నేను రెడీ అంటూ డేరింగ్ స్టేప్ వేస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. ఆడియన్స్ వస్తారా లేదా అన్న విషయంలో ఇంకా క్లారిటీనే రాలేదు. అయినా థియేట్రికల్ రిలీజ్‌కు నేనురెడీ అంటుంది ఈ హాట్ బ్యూటీ. కియారా యాక్ట్ చేసిన బాలీవుడ్ మూవీ ‘ఇందూకీ జవానీ’. రిలీజ్‌కు రెడీ గా ఉన్న ఈ మూవీని థియేటర్లలోనే రిలీజ్ చేస్తామంటున్నారు మేకర్స్. స్టార్ హీరోలు కూడా ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించగలమా అని డౌట్‌ పడుతుంటే.. కియారా గ్లామర్‌ మీద కాన్ఫిడెన్స్‌తో థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతున్నారు.

అంతేకాదు ‘ఇందూకి జవానీ’ రిలీజ్‌కు డేట్‌ కూడా ఫిక్స్ చేశారు. డిసెంబర్ 11న మూవీ రిలీజ్ అవుతుంది‌. అది కూడా బిగ్ స్క్రీన్ మీదే. బీ రెడీ ఆడియన్స్‌ ఇక గ్లామర్ షో ఆన్ 70 ఎమ్.ఎమ్ స్క్రీన్స్ అంటూ అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ ఇచ్చారు కియారా. మరి అమ్మడి అందానికి ఆడియన్స్‌ను థియేటర్స్‌కు ఎట్రాక్ట్ చేసేంత సీనుందా..? లెట్స్ వెయిట్ చేయాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: