బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ.... షాక్ మీద షాక్ ఇస్తోంది. తాజాగా ఆమె నటించిన "ఇందూకి  జవానీ" చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తామని మేకర్స్ భావించగా దానికి తన వైపు నుండి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కియారా. డిసెంబర్ 11న ఈ చిత్రం థియేటర్లో బిగ్ స్క్రీన్ పై రిలీజ్ అవుతుంది‌. బీ రెడీ ఆడియన్స్‌... ఇక గ్లామర్ షో ఆన్ 70 ఎమ్.ఎమ్ స్క్రీన్స్ అంటూ అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ ఇచ్చారు కియారా. దీంతో అభిమానులు షాక్ తిన్నారు. స్టార్ హీరోలు సైతం థియేటర్ల లో రిలీజ్ చేయడానికి ఆలోచిస్తుంటే... కియారా మాత్రం ఇంత ఈజీగా రిస్క్ చేసింది ఏంటి...?? అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇది ఒక ఎత్తయితే..... తన ట్వీట్ ఇప్పుడు మరో ఎత్తు అయింది. బాలీవుడ్ ప్రముఖ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో.. కియారా లవ్ లో పడ్డట్లు...ప్రస్తుతం తనతో రిలేషన్ లో ఉన్నట్లు గత కొంతకాలంగా సెన్సేషనల్ టాక్ నడుస్తోంది. ఇప్పుడా వార్తకు మరింత బలాన్ని చేకూర్చేలా కియారా ట్వీట్ వుందంటూ బీ టౌన్ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. కియారా అద్వానీ కథానాయికగా నటించిన 'ఇందూకీ జవానీ' ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

అయితే కియారా ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ట్రైలర్ లింక్ పై సిద్దార్థ్ స్పందిస్తూ 'ఇందూ ఫుల్ ఫైర్ లో ఉంది.. చూడ్డానికి ఎంతో వెయిట్ చేస్తున్నామ'ని ట్వీట్ చేశాడు. దీనికి కియారా 'ఇందూ కూడా నిన్ను చూడ్డానికి ఎదురుచూస్తోంద'ని రిప్లై ఇచ్చింది. దీంతో ఇప్పటివరకు వీరి మధ్య రిలేషన్ నడుస్తుందన్న విషయం నిజమేనేమో అని... అందుకే ఇన్ డైరెక్ట్ గా వీళ్ళు ఇలా క్లారిటీ ఇస్తున్నారంటూ... కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ సినీ ఇండస్ట్రీలో ఇటువంటి రూమర్స్ కు ఏమాత్రం కొదవలేదు అంటున్నారు ఆమె అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: