ఇంకా నాలుగు వారాల్లో బిగ్ బాస్ సీజన్ 4 కు ముగింపు పలబోతున్న తరుణంలో టాప్ 5 లోకి ఎవరు వస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. గత వారం లాస్య ఎలిమినేట్ అయినా నేపథ్యంలో ప్రస్తుతం కేవలం ఏడుగురు మాత్రమే ఇంట్లో మిగిలారు. ఇక ఇందులో నుండి కేవలం ఐదుగురు మాత్రమే చివర వరకు ఆడుతారు. ఫైనల్ టాప్ 5 లో అభి, హారిక, మోనాల్. సోహెల్, అవినాష్ ఉంటారని పలువురు జోష్యం చెప్తున్నారు.



రాహుల్‌ సిప్లిగంజ్‌ షాకింగ్‌ కామెంట్స్

ఇటువంటి నేపథ్యంలో బిగ్ బాస్ చివరి సీజన్ విజేత అయినా రాహుల్ సిప్లిగంజ్‌ ప్రస్తుత సీజన్ పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. ఒక న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో బిగ్ బాస్ 4 వ సీజన్ కి సంబందించిన పలు సంచలన విషయాలు తెలిపాడు. నాల్గవ సీజలో ఎవరు విజేతగా నిలవబోతున్నారు ? అలాగే టాప్ 2 ఎవరు ? అఖిల్ టాప్ కి ఎందుకు చేరుకోలేడు అనే విషయాలపై సంచలన వ్యాఖ్యలు చేసాడు.



బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ లో విజేత గా అభిజిత్ కాని సోహెల్ కానీ ఉండచ్చు అని అలాగే అరియానాకు కూడ కొంత అవకాశాలు ఉన్నాయంటూ వెల్లడించారు. సీక్రెట్ రూమ్ కి వెళ్లిన తర్వాత అఖిల్ కి క్రేజ్ తగ్గిందని, అందుకు కారణం అఖిల్ చెప్పిన ఒక డైలాగే అని చెప్పుకోచ్చారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని బయటకు పంపించి ఇక్కడ వీక్ కంటెస్టెంట్స్ తో ఆట ఎలా ఆడుతారు అంటూ అఖిల్ చెప్పిన మాటకు నాగార్జున సర్ కి కోపం వచ్చిందని, అందుకే ప్యాక్ యువర్ బాగ్స్ అంటూ కోపం గా చెప్పారని తెలిపారు. ఇక పోతే మేక లోపలి వెళ్లి ప్రోటీన్స్ తిని పులిలా బయటకు వచ్చిందని చెప్పిన పిల్లల డైలాగ్స్ తో అఖిల్ తనను తానూ డీగ్రేడ్ చేసుకున్నారని పేర్కొన్నారు. అభి తో గొడవల్లో అఖిల్ మైనస్ అయ్యాడని కూడా తెలిపారు. అఖిల్ చివరి వారాల్లో పుంజుకునే అవకాశం లేదా అంటూ అడిగిన ప్రశ్నకు ఆ టైం దాటిపోయిందని అఖిల్ కి విన్నర్ అయ్యే అవకాశం లేదు అంటూ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: