తెలుగు సినీ పరిశ్రమలో ప్రిన్స్ గా పేరున్న ఒకే ఒక్కడు మహేష్ బాబు. ఇప్పటికే నాలుగు పదుల వయసు దాటుతున్నా చెరగని చార్మింగ్ తో అమ్మాయిల మనసులను దోచుకుంటూ యువరాజుగా దూసుకు పోతున్నాడు. వరుస  సూపర్ హిట్ సినిమాలతో రికార్డులను సైతం చెరిపేస్తూ అందనంత ఎత్తుకు చేరుకున్నాడు. అయితే ఇప్పుడు సరికొత్తగా పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే మూవీలో నటిస్తున్నాడు. కరోనా కారణంగా అనుకున్న విధంగా షూటింగులు జరగకపోవడంతో, మళ్ళీ సరికొత్త ప్రణాళికతో షూటింగును చేయడానికి చిత్ర బృందం అంతా రెడీ అవుతోంది.

ఎలాగు షూటింగ్ జనవరి లో కాబట్టి ఈ లోపు దొరికిన సమయాన్నికుటుంబంతో గడపడానికి నిర్ణయించుకున్నారు మహేష్. ఈ నేపథ్యంలో మహేష్ మరియు గౌతమ్ నడిచి వెళ్తున్న ఫోటో ఒకటి ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఫోటో ప్రత్యకత ఏమిటీ అనుకుంటున్నారా...? ఈ ఫోటో చూసిన ఎవరైనా వాళ్ళు తండ్రీ కొడుకులా లేదా అన్నదమ్ముల అనే సందేహం కలగక తప్పదు...ప్రస్తుతం మహేష్ వయసు 45 అయినా ఇప్పటికీ 20 ప్లస్ లానే కనబడుతున్నారు.

మహేష్ లుక్ కూడా ఫుల్ గా మార్చేశారు...ఇదంతా సినిమా కోసమే అని మీకు తెలిసినదే... ఈ సినిమా కూడా హిట్ కొట్టి తనకు తానే సాటి అని నిరూపించుకుంటాడా లేదా చూడాలి. గీత గోవిందం లాంటి క్లాసికల్ హిట్ తరువాత పరశురామ్ చేస్తున్న సినిమా కావడంతో అటు మహేష్ అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా సాఫ్ట్వేర్ బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో జరిగిన కథగా చెబుతున్నారు. మరోసారి మహేష్ క్లాసికల్ లుక్ తో అందరినీ ఆకట్టుకోనున్నాడు. ఈ సినిమాలో మహేష్ సరసన మహానటి కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య విడుదలయిన సినిమాలలో కొంచెం జోరు తగ్గినా...ఈ సినిమాతో మళ్ళీ విజయాల బాట పట్టాలని ప్రయత్నిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: