పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు పడవలమీద ప్రయాణం ఎంతవరకు సక్సెస్ అవుతుందేమో కానీ వరుస సినిమాలు మాత్రం చేసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా ను రిలీజ్ కి రెడీ గా ఉంచాడు. ఆ తర్వాత మలయాళం రమకే అయ్యప్పనుం కోశియుమ్ సినిమా ను చేస్తున్నాడు.. క్రిష్ సినిమా పనులు షెరవేగంగా జరుగుతున్నాయి. హరీష్ శంకర్ కూడా స్టోరీ ఇప్పటికే సిద్ధం చేశాడు. పవన్ రాకకోసం వేచిచూస్తున్నారు.. చూడబోతే వచ్చే ఎలక్షన్స్ వరకు పవన్ కాలెండర్ ఖాళీగా లేనట్లు కనిపిస్తుంది.

వకీల్ సాబ్ తర్వాత అనూహ్యంగా రీమేక్ సినిమా రావడంతో క్రిష్ సినిమా కాస్త వెనక్కి జరిగింది. దాంతో ఆ సమయాన్ని వేరే హీరో తో భర్తీ చేస్తున్నాడు.. ఆ సినిమా కూడా పూర్తి అవొచ్చింది.. తక్కువ టైం లో పెద్ద సినిమాలు చేసే క్రిష్ వైష్ణవ్ తేజ్ తో చేసినా సినిమా ను తక్కువ రోజుల్లో పూర్తి చేసి పవన్ సినిమా కు అందుబాటులో ఉన్నాడు.. ఇక హరీష్ శంకర్ పూర్తి గా పవన్ సినిమా మీదే దృష్టి పెట్టాడు.. గతంలో వీరి కాంబో లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు.. ఒకరకంగా పవన్ కళ్యాణ్ కి అది కం బ్యాక్ సినిమా గా చెప్పొచ్చు.

అయితే రీ ఎంట్రీ లో అభిమానుల దాహం తీరాలంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.. వకీల్ సాబ్ సినిమా ఎప్పుడో మొదలైనప్పటికీ ఇంతకీ రాకపోయేటప్పటికీ అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. అయితే ఈ సినిమా  విడుదల  ఏప్రిల్ లేదా మేలో ఉండేలా నిర్మాత దిల్ రాజు ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు హింట్ ఇచ్చారని ఫిలిం నగర్ టాక్. బయటికి కన్ఫర్మ్ చేయలేదు. అయితే ఇది అభిమానులకు పెద్ద షాక్ అని చెప్పాలి. నిజానికి ఆ సమయంలో ఆచార్య ని తీసుకురావాలని ప్రయత్నాలు జరగగా ఇప్పుడు ఆ ప్రయత్నాన్ని చిరు విరమించుకున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: