ప్రభాస్ ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. 3-డీలో రూపొందనున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ - కృష్ణ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.  తెలుగు హిందీ భాషల్లో సినిమా ను నిర్మించి దాదాపు 25 భాషల్లోకి ఈ సినిమా ని డబ్ చేస్తారట.. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో రాముడిగా ప్రభాస్ నటిస్తుంటే రావణాసురుడు గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.. సీతా పాత్ర పై ఇంకా క్లారిటీ రాలేదు..

ఇప్పటికే కీర్తి సురేష్, ఊర్వశి రౌటేలా,  కియారా అద్వానీ వంటి వారిని ట్రై చేస్తున్నా ఎవరు సెట్ కావడంలేదు.. పాన్ ఇండియా సినిమా కావడంతో బాలీవుడ్ హీరోయిన్ కే హీరోయిన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.. ఇక ఈ సినిమా లో లక్ష్ముడి పాత్ర కు కూడా బాలీవుడ్ నటుడిని ఎంపిక చేస్తున్నారట..  `సోను కె టిటు కి స్వీటీ` ఫేం సన్నీ సింగ్ ఆ పాత్రకు ఎంపికయ్యారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే శ్రీరాముడిగా ప్రభాస్ కనిపిస్తే సోదరుడు లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కనిపిస్తారన్నమాట.

అయితే ఇలా ప్రతి పాత్రను బాలీవుడ్ నటులను ఎంపిక చేసుకుంటూ పోతే సౌత్ సినిమా ఫీల్ రాదనీ ప్రభాస్ ఫాన్స్ చర్చించుకుంటున్నారట.. వీలైతే సౌత్ వాళ్ళను పెట్టి అన్ని భాషల నటుల్ని కవర్ చేయాలని కోరుతున్నారట.. ఇక సాహో సినిమా తర్వాత ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా లో దీపికా పదుకొనె నటిస్తుండగా అశ్వని దత్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రాధేశ్యామ్ సినిమా పూర్తి కాగానే సెట్స్ మీదకు వెళ్తుండగా ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుండడం విశేషం..

మరింత సమాచారం తెలుసుకోండి: