టాలీవుడ్లో ఏ హీరో అయినా వరుసగా రెండు హిట్లు కొడితే వెంటనే తన రెమ్యూనరేషన్ ని పెంచేస్తూ ఉంటాడు.అలా ఇప్పటికే యువ హీరోలు చాలా మంది తమ రెమ్యునరేషన్ ని లక్షల నుంచి కోట్లకు పెంచేశారు. ఇప్పుడు మరో మెగా హీరో కూడా అదే లిస్టులో చేరిపోయాడు. అతడు మరెవరో కాదు మన మెగా హీరో వరుణ్ తేజ్. తెలుగులో 'ముకుంద' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ కీ.. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో నటించిన కంచె సినిమాతో మొదటి విజయాన్ని అందుకున్నాడు ఈ హీరో. ఆ సినిమాలో ముఖ్యంగా వరుణ్ తన నటనతో అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక తర్వాత కొన్ని సినిమాలు చేసిన అవి అంతగా ఆడలేదు.

 అయితే చిన్న గ్యాప్ తరువాత వరుణ్ నటించిన 'తొలిప్రేమ' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఇక అక్కడినుంచి ఈ హీరో నటించిన గద్దల కొండ గణేష్, ఎఫ్2,సినిమాలు వరుసగా మంచి హిట్స్ సాధించాయి. దీనితో ఇప్పుడు ఈ హీరో తన రెమ్యూనరేషన్ ని అమాంతం పెంచినట్లు ఇండ్రస్టీ లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడి f2 కు సీక్వెల్ గా f3 సినిమాని తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడు. ఇక F2లో వెంకటేష్ తో కలిసి నటించిన వరుణ్ తేజ్.. ఈ సీక్వెల్ లో కూడా నటించనున్నాడు. అయితే ఈ సినిమాకి వరుణ్ తేజ్ హై రెమ్యూనరేషన్ ని అడుగుతున్నాడట.

వెంకీ తీసుకునే రెమ్యూనరేషన్ కు సమానంగా అంటే దాదాపు 12 కోట్లు ఇవ్వాలని అడుగుతున్నట్లు తాజా సమాచారం. వరుణ్ తేజ్ ఇప్పటివరకు ఒక్కో సినిమాకు 7 నుంచి 8 కోట్లు తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఏకంగా నాలుగు కోట్లు ఎక్కువ. కరోనా కారణంగా హీరోలందరూ 20 శాతం తగ్గించాలని దిల్ రాజ్ తో కూడిన "ఆక్టివ్ ప్రొడ్యూసర్ గిల్డ్" ఆదేశాలు ఇచ్చింది. కానీ దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాకే హీరోలు పారితోషికాలు పెంచుతున్నారు. అయితే దీనిపై నిర్మాత దిల్ రాజు ఇంకా ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరి వరుణ్ అడిగినంత దిల్ రాజు ఇస్తాడా.. లేక వరుణ్ ప్లేస్ లో మరో హీరో వచ్చి చేరతాడా అనేది మరి కొద్ది రోజుల్లో తేలనుంది.చేస్తున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: