యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తూం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రభాస్ చేస్తున్న రాధే శ్యాం సెట్స్ మీద ఉంది. ఈ సినిమాను యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. 250 కోట్ల దాకా ఈ సినిమా బడ్జెట్ పెట్టేస్తున్నారని తెలుస్తుంది. పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 2021 సమ్మర్ రిలీజ్ టార్గెట్ తో వస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. సినిమాలో రావణుడి పాత్రలో సైఫ్ ఆలి ఖాన్ నటిస్తున్నారు. ఓం రౌత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా బడ్జెట్ కూడా 400 కోట్ల దాకా ఉంటుందని తెలుసుతంది. ఇక ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ డైరక్షన్ లో ప్రభాస్ సినిమా ఉంది.

అయితే ఈ సినిమాలో ప్రభాస్ తో పాటుగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో బిగ్ బీ గెస్ట్ రోల్ లో నటిస్తాడని అనుకున్నారు కాని సినిమాఒలో అమితాబ్ కు చాలా ఇంపార్టెంట్ రోల్ ఇస్తున్నారట. ప్రభాస్ కు ఈక్వల్ గా ఈ రోల్ ఉంటుందని టాక్. సైరా సినిమాతో డైరెక్ట్ తెలుగు సినిమా చేసిన అమితాబ్ ఆ తర్వాత నాగ్ అశ్విన్ సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమా హీరోయిన్ దీపిక పదుకొనె కూడా నటిస్తుందని తెలిసిందే.                                                                                    

మరింత సమాచారం తెలుసుకోండి: