ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వున్న ఉత్తమ నటులలో మోహన్ బాబు ఒకరు.ఆయన కూతురు మంచు లక్ష్మి కూడా మంచి మంచి సినిమాలు చేస్తూ సామాజిక కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటుంది. ఇక మంచు లక్ష్మి ఇంటర్వ్యూ ఇచ్చిందంటే అందులో ఉండే మజానే వేరు. ఇంగ్లీష్, తెలుగు పదాలను కలిపి వాడుతూ తనదైన స్టైల్ మాటలతో ఆకట్టుకుంటుంది. అందుకే ఈమె  మాటలను చాలా శ్రద్దగా వింటుంటారు ప్రేక్షకులు. పైగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ  ఎప్పటికప్పుడు సమాజంలో జరిగే విషయాలపై రియాక్ట్ అవుతూ ఉంటుంది.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను బయటపెడుతూ ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.

ఆ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి మాట్లాడుతూ ఓ హీరోకు పెళ్లి అయిందని తెలియడంతో ఏడ్చానని చెప్పి ఆశ్చర్యపరిచింది. ఆ హీరో మరెవరో కాదట.. ఆమిర్ ఖాన్ అని, ఆయనకు తాను పెద్ద ఫ్యాన్ అని చెప్పింది. అయితే ఆమిర్  పెళ్లి చేసుకున్నాడని తెలిశాక చాలా బాధ అనిపించిందని చెప్పిన ఈ మంచువారమ్మాయి.. ఆమిర్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్న సమయంలోనూ ఏడ్చేశానని చెప్పడం విశేషం. ముఖ్యంగా ఆమిర్ ఖాన్ సినిమాలను ఎంచుకునే విధానం తనకు బాగా నచ్చుతుందని మంచు లక్ష్మి చెప్పింది.

ఇక తెలుగు హీరోల విషయానికొస్తే తాను నాగార్జునకు వీరాభిమానిని అని మంచు లక్ష్మి చెప్పింది. అందుకే ఎప్పుడైనా ఆమిర్ ఖాన్, నాగార్జున పేర్లు వింటే ఏదో అయిపోతుందని ఆమె చెప్పుకొచ్చింది. దీంతో మంచు లక్ష్మి చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈమె మాటలకు నెటిజన్స్  పలు రకాలుగా రియాక్ట్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: