ఆ తర్వాత సునీల్ హీరోగా పూలరంగడు, కృష్ణాష్టమి, జక్కన్న, Mr .పెళ్ళికొడుకు అనే సినిమాలతో హీరోగా రాణించాడు..ఆ తర్వాత కొన్ని రోజులు విరామం తర్వాత సునీల్ అరవింద సమేత వీరరాఘవ లో హీరోకి సపోర్టింగ్ క్యారెక్టర్ లో నటించారు .. ఆ తర్వాత రవి తేజ హీరోగా కెవి ఆనంద్ దర్శకత్వం లో వచ్చిన డిస్కో రాజా చిత్రం లో నెగటివ్ పాత్రలో సునీల్ నటించారు .. తర్వాత తాజాగా మొన్న వచ్చిన కలర్ ఫోటో చిత్రం తో హీరోయిన్ కి అన్నయ్య పాత్రలో ఎంట్రీ ఇచ్చారు సునీల్ ..కలర్ ఫోటో చిత్రం ప్రేక్షకులకు నచ్చడంతో సునీల్ మళ్లీ కొత్త సినిమాలపై దృష్టి పెట్టారు .. ఈ నేపథ్యంలో సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప చిత్రం లో సునీల్ విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం..
అసలు విషయానికొస్తే మర్యాద రామన్న లో ప్రేక్షకులను అలరించిన సునీల్ మరియు సలోని జంట ఇప్పుడు మరోసారి కలిసి తెర పంచుకోబోతున్నట్లు తెలుస్తోంది..సునీల్ ప్రస్తుతం వి.ఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.. ఇందులో హీరోయిన్ గా సలోని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.. దీనిపై అధికారికంగా ఒక ప్రకటన కూడా ఇవ్వనున్నట్లు సమాచారం.. హీరోయిన్ గా సలోని సెలక్ట్ అయితే పదేళ్ల తర్వాత మరోసారి మర్యాదరామన్న జంటని తెరపై చూడవచ్చు.. ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ ని హైదరాబాద్ చుట్టుపక్కల నిర్వహిస్తున్నామని మూవీ టీం చెబుతుంది..