మేర్లపాక గాంధీ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ హిట్ అయిన 'అంధాధూన్' రీమేక్ లో నటిస్తున్నారు.. సినిమా లో హీరో ఒక బ్లైండ్ కాగా ఈ పాత్రకు నితిన్ ఒప్పుకోవడం పెద్ద రిస్క్ అయితే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను తమన్నా ఒప్పుకోవడం ఇంకా పెద్ద రిస్క్.. కథ ప్రాధాన్యం ఉన్న సినిమా కావడంతో తమన్నా ఈ సినిమా కి ఒప్పుకుందని అంటున్నారు. నితిన్ కెరిర్ లో ఇది ఓ మైల్ స్టోన్ మూవీ గా మిగిలిపోతుందని అంటున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత నితిన్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాగా ‘భవ్య క్రియేషన్స్’ అధినేత ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలానే 'చల్ మోహన్ రంగా' ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో 'పవర్ పేట' అనే సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక అందరికి 2020 ఏడాది గుర్తుండి పోయినట్లే నితిన్ కి కూడా మరపురాయి ఏడాదిగా నిలిచిపోనుంది. అదికూడా ఈ సినిమాలు హిట్ లు గా నిలిస్తేనే సుమా..