పెళ్లి అయిన తరువాత నితిన్ తన జోరును పెంచాడు..ఇటీవలే భీష్మ తో సూపర్ హిట్ అందుకున్న నితిన్ ప్రస్తుతం రంగ్ దే సినిమా చేస్తున్నాడు.. వెంకీ అట్లూరి ఈ సినిమా కి దర్శకుడు కాగా ఈ సినిమా తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు.. తొలి సినిమాగా వచ్చిన తొలిప్రేమ హిట్ కాగా, అఖిల్ మిస్టర్ మజ్ను కూడా మంచి హిట్ సాధించింది.. ఇప్పుడు నితిన్ తో చేస్తున్న రంగ్ దే సినిమా కూడా మంచి హిట్ కొట్టి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు.. ఈ సినిమా దాదాపుగా పూర్తి కావొచ్చింది.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఇంకా పూర్తి కాకముందే నితిన్ బాలీవుడ్ సినిమా ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే..

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ హిట్ అయిన 'అంధాధూన్' రీమేక్ లో నటిస్తున్నారు..  సినిమా లో హీరో ఒక బ్లైండ్ కాగా ఈ పాత్రకు నితిన్ ఒప్పుకోవడం పెద్ద రిస్క్ అయితే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను తమన్నా ఒప్పుకోవడం ఇంకా పెద్ద రిస్క్.. కథ ప్రాధాన్యం ఉన్న సినిమా కావడంతో తమన్నాసినిమా కి ఒప్పుకుందని అంటున్నారు. నితిన్ కెరిర్ లో ఇది ఓ మైల్ స్టోన్ మూవీ గా మిగిలిపోతుందని అంటున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత నితిన్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాగా  ‘భవ్య క్రియేషన్స్’ అధినేత ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలానే 'చల్ మోహన్ రంగా' ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో 'పవర్ పేట' అనే సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక అందరికి 2020 ఏడాది గుర్తుండి పోయినట్లే నితిన్ కి కూడా మరపురాయి ఏడాదిగా నిలిచిపోనుంది.  అదికూడా ఈ సినిమాలు హిట్ లు గా నిలిస్తేనే సుమా..

మరింత సమాచారం తెలుసుకోండి: