మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తాను చేస్తున్న ఆచార్య సినిమాపై గట్టిగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గత ఏడాది సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్, ఆ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. అయితే రిలీజ్ తరువాత ఆ సినిమా ఆశించిన రేంజ్ సక్సెస్ ని ఆయనకు అందివ్వలేకపోయింది. దానితో ప్రస్తుతం చేస్తున్న ఆచార్య మూవీ విషయమై ప్రతి ఒక్క అంశాన్ని ఎంతో జాగ్రత్తగా పరిశీలించి చేస్తున్నారట మెగాస్టార్. వరుస విజయాల దర్శకడు కొరటాల శివ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి ఒక పవర్ఫుల్ రోల్ చేస్తుండగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇందులో ఒక ప్రత్యేక పాత్ర చేయనున్న విషయం తెలిసిందే.

మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి తిరు ఫోటోగ్రఫిని అందిస్తుండగా కాజల్ అగర్వాల్ ఇందులో మెగాస్టార్ కి జోడీగా నటిస్తోంది. ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల ప్రారంభం అయింది. ఇకపోతే దీని తరువాత ఇప్పటికే వివి వినాయక్ దర్శకత్వంలో లూసిఫర్ మూవీ తెలుగు రీమేక్ లో నటించడానికి సిద్దమైన మెగాస్టార్, మరోవైవు మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం సినిమా తెలుగు రీమేక్ లో కూడా నటించడానికి సిద్ధమయ్యారు. కాగా ఈ రెండు సినిమాలకు సంబంధించి అతి త్వరలో అధికారిక ప్రకటనలు రానున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు వీటి అనంతరం మరొక ప్రముఖ దర్శకుడి కథకు కూడా మెగాస్టార్ పచ్చ జండా ఊపినట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ఈ విధంగా మెగాస్టార్ ఎంచుకుంటున్న సినిమాల లైనప్ ని ఒకసారి పరిశీలిస్తే ఆయన మైండ్ గేమ్ ఏంటో అర్ధం అవుతుందని, ఎక్కువగా అన్ని వర్గాల ప్రేక్షకుల తో పాటు తన ఫ్యాన్స్ ని ఎంతో అలరించే సబ్జక్ట్స్ వైపే మెగాస్టార్ మొగ్గుచూపుతున్నారని, ఆ విధంగా సినిమాలు ఎంచుకోవడం వలన అవి అందరికి చేరువై తనకు మరింత క్రేజ్ తెచ్చిపెడతాయని ఎంతో జాగ్రత్తగా ఎంచుకుంటున్నారట. మొత్తంగా చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలతో కనుక సక్సెస్ కొడితే మరొక్కసారి టాలీవుడ్ లో ఆయనకు ఎదురు ఉండదని అంటున్నారు విశ్లేషకులు....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: