యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టాక్ షోపై పెద్దగా ఇంట్రెస్ట్ లేదని చెప్పాడట. లేటెస్ట్ గా స్టార్ హీరోయిన్ అక్కినేని కోడలు సమంత చేస్తున్న టాక్ షో సామ్ జామ్ షో సెలబ్రిటీస్ ను ఇంటర్వ్యూ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొదటి ఎపిసోడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో చిట్ చాట్ చేసింది. అర్జున్ రెడ్డి హీరోకి సంబందించిన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాల గురించి సమంత ఇంట్రెస్ట్ ప్రశ్నలు.. అందుకు తగిన సమాధానాలు రాబట్టింది.

ఇక సమంత టాక్ షోకి సెకండ్ గెస్ట్ గా రానా వచ్చాడు. దగ్గుబాటి హీరో రానా తన హెల్త్ విషయం గురించి చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. రానా ఇంతవ్సరకు ఎక్కడ రివీల్ చేయని తన హెల్త్ సీక్రెట్ ను సామ్ జామ్ షోలో చెప్పి షాక్ ఇచ్చాడు. సో అంతకుముందు రానా హెల్త్ విషయంలో వచ్చిన వార్తలన్ని నిజమే అని తేలింది. రానాతో పాటుగా నాగ్ అశ్విన్ కూడా సమంత టాక్ షోలో పాల్గొన్నాడని తెలిసిందే.

రానా తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా సమంత సామ్ జామ్ షోలో పాల్గొన్నాడని తెలుస్తుంది. సాం జాం షోని సక్సెస్ చేసేందుకు ఆహా టీం ఫుల్ ఎఫర్ట్స్ పెడుతుంది. మొదటి ఎపిసోడ్ లో కొన్ని సేవా కార్యక్రమాలను కూడా చూపించారు. కాని సెకండ్ ఎపిసోడ్ నుండి కేవలం సెలబ్రిటీ చిట్ చాట్ మాత్రమే తీసుకున్నారు. అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను సమంత షోకి తీసుకు రావాలని అనుకున్నారు కాని అది కుదరలేదని తెలుస్తుంది. ప్రభాస్ ప్రస్తుతం ఎలాంటి టాక్ షోలో పాల్గొనే ఇంట్రెస్ట్ లేదని చెప్పాడని తెలుస్తుంది.                                         
 

మరింత సమాచారం తెలుసుకోండి: