ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్స్ కలిసి దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఇందులో ప్రభాస్ క్యారెక్టర్ అదిరిపోతుందని, కొన్నేళ్ల క్రితం యూరోప్ లో జరిగిన ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు షూటింగ్ జరుపుకుంది. మిగతా భాగం షూటింగ్ అతి త్వరలో హైదరాబాద్ లో నిర్వహించి ఆపై సినిమాని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది వేసవి లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తోంది రాధేశ్యామ్ యూనిట్.
సీనియర్ రెబల్ స్టార్ కృషంరాజు, బాలీవుడ్ నటి భాగ్యశ్రీ, ప్రియదర్శి, మురళీశర్మ, జయరాం తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తుండగా జస్టిన్ ప్రభాకరన్ దీనికి  మ్యూజిక్ ని అలానే మనోజ్ పరమహంస ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇక దీని తరువాత ప్రభాస్ వైజయంతి మూవీస్ బ్యానర్ ఫై ఒక భారీ సైన్స్ ఫిక్షన్ సినిమా తో పాటు ఆదిపురుష్ అనే హిస్టారికల్ డ్రామా మూవీ లో కూడా నటించనున్నారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా సీత పాత్రలో అందాల నటి కృతి సనన్ నటించనున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే ఈ సినిమా కోసం ఫీజికల్ గా తన బాడీని ఎంతో ఫిట్ గా తాయారు చేస్తూ కష్టపడుతున్నారు ప్రభాస్. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి తరువాత సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఒక వార్త పలు టాలీవుడ్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది. అదేమిటంటే, ఈ సినిమా ని దాదాపుగా రూ.600 కోట్లకు పైగా ఖర్చుతో ఎంతో భారీగా టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మించనున్నారని, అయితే అందులో ఎక్కువ మొత్తం గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కె ఖర్చు అవుతోందని, ఇక ముఖ్యంగా ఈ సినిమా కోసం ప్రముఖ హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ అవెంజర్స్ కి పనిచేసిన టెక్నీకల్ టీమ్ పనిచేయనున్నట్లు టాక్. ఇప్పటికే వారితో సంప్రదింపులు జరిపిన ఆదిపురుష్ యూనిట్, అతి త్వరలో ఆ విషయమై వారితో ఒప్పందం కూడా కుదుర్చుకోనుందట. మరి ఇదే కనుక నిజమైతే ఆదిపురుష్ సినిమా అవుట్ ఫుట్ అదిరిపోవడం ఖాయం అని అంటున్నారు విశ్లేషకులు. కాగా దీనిపై ఆదిపురుష్ మూవీ యూనిట్ నుండి అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: