స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా అలవైకుంఠపురములో. ఈ ఏడాది సంక్రాతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ ని అందుకుని అంతకముందు కెరీర్ పరంగా సక్సెస్ కోసం సతమతం అవుతున్న అల్లు అర్జున్ కు మంచి బ్రేక్ ని అందించింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి యువ సంగీత తరంగం థమన్ అందించిన మ్యూజిక్ దేశవిదేశాల్లో ఉన్న మ్యూజిక్ లవర్స్ ని ఎంతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
సుశాంత్ ఒక ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాకి పీఎస్ వినోద్ అద్భుతమైన రేంజ్ లో ఫోటోగ్రఫిని అందించారు. ఇకపోతే ఈ సినిమాలో కీలకమైన హీరో తండ్రి రామచంద్ర పాత్రలో నటించిన మలయాళ నటుడు జయరాం తన పెర్ఫార్మన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నారు. టబు కి భర్త గా ఈ సినిమాలో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతకముందు అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన భాగమతి మూవీలో కూడా కీలక రోల్ చేసి ఆకట్టుకున్న జయరాం, ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా రాధేశ్యామ్ లో ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు.

ఇకపోతే ఇటీవల ఈ సినిమా షూటింగ్ జరిగిన సమయంలో ప్రభాస్ తో కలిసి జయరాం దిగిన ఫోటో నేడు ఉదయం నుండి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మంచి మనసు, ఇతరులను ఎంతో గౌరవించే వ్యక్తిత్వం ఉన్న ప్రభాస్ రాబోయే రోజుల్లో మరింత ఉన్నతస్థాయికి చేరుతారని, ఇక ప్రస్తుతం తెరకెక్కుతున్న రాధేశ్యామ్ లో తన పాత్ర ప్రేక్షకులను అలరిస్తుందని, అలానే ఈ సినిమా తనని తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువచేస్తుందని, అలానే సినిమాని దర్శకుడు రాధాకృష్ణ ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని ఆయన ఒక ఇంటర్వ్యూ లో భాగం వెల్లడించినట్లు తెలుస్తోంది.... !!
 

మరింత సమాచారం తెలుసుకోండి: