ఒకప్పుడు సినిమాలు అంటే చాలా ప్యాషన్తో ఉండేవాళ్ళు నిర్మాతలు ఇప్పుడు ఆ పరిస్థితి చాలా మేరకు తగ్గిందని చెప్పవచ్చు ప్యాషన్ అనే దానికంటే కమర్షియల్ యాంగిల్స్ కోసమే ఎక్కువ పరి తపిస్తున్నారు. అందుకే ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను మరో భాషలో రీమేక్ చేయడం అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. అంటే పాత సినిమాలను కూడా రీమేక్ చేసేవారు కదా అని మీరు అనుకోవచ్చు నిజమే దశాబ్దాల నాటి నుంచి ఒక భాషలోని సినిమాని మరో భాషలో రీమేక్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. 


అయితే ఈ మధ్య కాలంలో బాలీవుడ్ వాళ్ళు ఇతర భాషల సినిమాలను రీమేక్ చేసే పనిలో పడ్డారు. మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల మీద వీళ్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని తేలింది. మన తెలుగు సినిమాల నుంచి దాదాపు పదుల సంఖ్యలో సినిమాలను రీమేక్ చేసే పనిలో పడ్డారు. ఒకసారి అవి ఏ ఏ సినిమాలు అనేది ఒక లుక్కేస్తే ఈ మధ్య కాలంలో నాని హీరోయిన్ వచ్చిన జెర్సీ సినిమాని అదే పేరుతో హిందీలో షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్నారు. అలాగే తెలుగు లో అనుష్క నటించిన భాగమతి సినిమా ని భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో దుర్గావతి అనే పేరుతో రీమేక్ చేశారు. 


ఇక మన దగ్గర సూపర్ హిట్ అయిన ప్రభాస్ చత్రపతి సినిమా మన బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అక్కడ రీమేక్ చేస్తున్నారు. ఇక గత ఏడాది సూపర్ హిట్ అయిన మత్తు వదలరా సినిమా ని కూడా అదే దర్శకుడు బాలీవుడ్ లో దీన్ని రీమేక్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అప్పుడు ఎప్పుడో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఊసరవెల్లి సినిమా కూడా బాలీవుడ్ లోకి తెరకెక్కుతోందని సమాచారం. ఇక్కడ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమా బాగా నచ్చడంతో అక్షయ్ కుమార్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు అని అంటున్నారు. ఇవే కాక చాలా సినిమాలు ఇంకా లిస్ట్ లో యున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: