ప్రస్తుతం మా టీవీ లో వచ్చే బిగ్ బాస్ రియాల్టీ షోకి బుల్లితెరపై ఎంతో క్రేజ్ ఏర్పడింది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బుల్లితెరపై ఎన్ని రకాలు షోలు  ఉన్నప్పటికీ బిగ్ బాస్ రియాలిటీ షో మాత్రం ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తూ టాప్ రేటింగ్ ను సొంతం చేసుకుంటుంది పోతుంది. ఇక బిగ్ బాస్ లో నాగార్జున వ్యాఖ్యాతగా అదరగొడుతు బుల్లితెర ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మనకు తెలిసిన సెలబ్రిటీల గురించి మనకు తెలియని విషయాలు తెలుసుకునేందుకు ప్రస్తుతం బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు.



 కాగా ప్రస్తుతం బిగ్ బాస్ షో చివరి అంకానికి చేరుకుంది అనే విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం మరింత రసవత్తరంగా మారిపోయింది బిగ్బాస్ షో. బిగ్ బాస్ హౌస్ లో కేవలం ఏడు మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. ఇక ఈ ఏడు మంది లో టాప్ 5 ఎవరు వెళ్ళ పోతున్నారు  అన్నది కూడా మరింత ఆసక్తికరం గా మారిపోయింది అయితే వారాంతంలో నాగార్జున బిగ్ బాస్ హౌస్ లో మరింత సందడి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే నిన్న జరిగిన బిగ్ బాస్ షో ఎంతో హాట్ హాట్గా జరిగింది. నాగార్జున అందరికీ ఒక రకంగా వార్నింగ్ ఇచ్చాడు అని చెప్పాలి.



 నిన్న జరిగిన షో లో భాగంగా కెప్టెన్ హారిక అభిజిత్ కి ఎక్కువగా ఫేవర్ గా ఉంది అని మాట్లాడిన నాగార్జున ఎంతగానో క్లాస్ పీకాడు ఇక ఆ తర్వాత అభిజిత్ ని ప్రశ్నించిన నాగార్జున బిగ్ బాస్ చెప్పిన తర్వాత కూడా ఎందుకు చేయడం లేదు అంటూ ప్రశ్నించడంతో అభిజిత్ సారీ చెప్పాడు. అదే సమయంలో ఎవరికి వారు ఇంటికి సొంతంగా  గేమ్ ఆడాలని... ఇంకెప్పుడూ తప్పులు చేయకూడదు అంటూ నాగార్జున ఏకంగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా దండం పెట్టి వేడుకుంటున్నాను అని చెప్పడం ఆసక్తి కరం గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: