వారు ఆ పాత్రను పండించేలా ఉండాలి. అలాంటపుడే సినిమా హిట్ అవుతుంది. ప్రేక్షకుడు కూడా అలా కధలోకి వెళ్తాడు. ఆ విధంగా తీసుకుంటే ఆదిపురుష్ సినిమాలో రాముడిగా ప్రభాస్ ని అనుకున్నారు. ఆజానుబాహుడు ఆరడుగుల అందగాడు కాబట్టి ప్రభాస్ ఓకే అనుకున్నా సీత ఎవరూ అన్నది మాత్రం ఇప్పటికీ ఒక చర్చగానే ఉంది.
సీత పాత్రలో నటించే వారికి నటనతో పాటు, ప్రభాస్ తో మాచ్ అయ్యేలా కూడా ఉండాలి. ఆ విధంగా అనేక పేర్లు అనుకుని ఇపుడు బాలీవుడు భామ కృతి సనన్ దగ్గరకు వచ్చి ఆగారని అంటున్నారు. మరి సీత పాత్రకు ఆమె నప్పుతుందా అంటే కాదు అంటున్నారు కొందరు. కృతి ఈ రోల్ ప్లే చేయలేదని అపుడే నెగిటివ్ కామెంట్స్ పడుతున్నాయి.
ఆ అమ్మడు తెలుగులో మహేష్ బాబు సరసన నేనొక్కడినే మూవీలో హీరోయిన్ గా చేసింది. ఆ తరువాత నాగ చైతన్యతో దోచేయ్ మూవీ చేసింది. రెండూ ఫట్ మన్నాయి. ఇక ఆమెలో ట్రెడిషనల్ లుక్ కంటే బబ్లీ లుక్కే కనిపిస్తుంది. ఆమెను సీత పాత్రకు తీసుకోవద్దు అని సజెషన్స్ కూడా వస్తున్నాయట.
అయితే ఆమెని తీసుకోవాలని దాదాపుగా ఫిల్మ్ డైరెక్టర్ ఓం రౌత్ డెసిషన్ తీసుకున్నాడని అంటున్నారు. ఆమెను మరి ఆయన ఎలా మౌల్డ్ చేస్తాడో అని అంటున్నారు ఇదిలా ఉంటే బాలయ్యతో బాపూ తీసిన శ్రీరామరాజ్యం మూవీ టైం లో కూడా ఇలాంటి విమర్శలే సీత పాత్రధారి నయనతార విషయంలో వచ్చాయని అంటున్నారు. కానీ ఆమె నటించి ఒప్పించి మెప్పించిందని అంటున్నారు. ఇపుడు కృతి కూడా తనదైన నటనతో అభినవ సీతగా రాణిస్తుందని కూడా మరి కొందరు అంటున్నారు. చూడాలి మరి.