ఇప్పుడున్న క్లిష్టమైన పరిస్థితుల్లో సరదాగా ఎంటర్టైన్ అవ్వడానికి మునుపటిలా సినిమా థియేటర్లకి వెళ్లే అవకాశం లేదు.దీంతో ఇప్పుడు అందరూ కూడా ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫాం ల వైపు మోగ్గుచూపుతున్నారు. ఇప్పటికే కొన్ని డిజిటల్ రంగాలు ప్రేక్షకులను అలరించడానికి కొన్ని కొత్త సినిమాలతో పాటు కొత్త కొత్త షో లను కూడా డిజైన్ చేస్తున్నాయి. ఆ షో లకి మంచి టీఆర్పీ రావాలంటే మంచి పేరు, ప్రఖ్యతలున్న హీరోలతో షోలు చేస్తే టీఆర్‌పీ భారీగా పేరుగుతుంది. ప్రస్తుతం నిర్మాత అల్లుఅరవింద్ ఈ సూత్రాన్నే ప్రతిపాదిస్తున్నాడు. అక్కినేని సమంతా యాంకర్‌గా సామ్ జామ్ అంటూ షోను ప్రారంభించాడు. ఇందులో సమంత ఉండటంతోనే షోకు క్రేజ్ వచ్చింది.

 దాంతో పాటు రౌడీ విజయ్ దేవరకొండ, దగ్గుపాటి రానా, నాగ్ అశ్విన్, మెగాస్టార్ చిరంజీవి సహా మరి కొందరు ఈ షోకు వచ్చారు. ఇలా చేయడం ద్వారా ఆ హీరోల అభిమానులు ఈ షోను విపరీతంగా చూస్తారు. అయితే ఆహా స్థాయిని పెంచేందుకు అల్లు అరవింద్ వేసిన ప్లాన్ సామ్ జామ్. ఇప్పటికే మొదలయ్యి మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ షో తరువాయి ఎపిసోడ్ల కోసం మరి కొందరు సెలబ్రటీలను కలిసారు.వారిలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నాడు. అయితే మన డార్లింగ్ మాత్రం ఈ షోపై అంతగా ఆసక్తి చూపలేదట.దీంతో ఆ టీమ్‌ని కొంచెం టచ్‌లో ఉండండి చెప్తా అన్నాడట. స్పతహాగానే ప్రభాస్‌కు సిగ్గెక్కువ.డిజిటల్ షోల వంటి వాటికి చాలా దూరంగా ఉంటాడు ఈ హీరో..

 ఇంతకుమందు ఒకసారి ప్రదీప్ మాచిరాజు షో కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా షోలో పాల్గొన్న ప్రభాస్.. ఆ తరువాత కొన్నాళ్లకు రానా, రాజమౌళితో కలిసి హిందీ షో కాఫీ విత్ కరన్‌కు వెళ్లాడు. అంతే మళ్లీ ఇప్పటి రకు ఏ షోలోనూ కనిపించలేదు.అంతేకాకుండా ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. వాటిలో రెండు పాన్ ఇండియా స్థాయి సినిమాలు కావడం విశేషం. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాదే శ్యామ్ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. మరి ఆ సినిమా ప్రమోషన్స్ కి అయిన ప్రభాస్ ఆ సమయంలో వస్తాడేమో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: