అక్కినేని హీరో అఖిల్ మూడు సినిమాలు చేసినా ఒక్కటి కూడా క్లిక్ అవలేదు. హ్యాట్రిక్ సినిమాలతో నిరాశపరచిన అఖిల్ ప్రస్తుతం చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాతో సూపర్ హిట్ అందుకునేలా ఉన్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో ఆమె గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని టాక్.

ఇక ఇదిలాఉంటే అఖిల్ తర్వాత తన నెక్స్ట్ సినిమా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అఖిల్ సినిమా వస్తుంది. సినిమా కథ ఓ పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా సిద్ధం చేశాడట.

చూస్తుంటే అఖిల్ బ్యాచ్ లర్ హిట్ తో పాటుగా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో కూడా సినిమా చేసి హిట్ కొట్టేలా ఉన్నాడు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల అంచనాలను రీచ్ అయ్యేలా ఉన్నాడని చెప్పొచ్చు. మరి ఈ ఎంటర్టైనర్ సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటాడా అని తెలుస్తుంది. ఈ సినిమా ఎలాంటి సత్తా చాటుతుందని అంటున్నారు. సైరా సినిమా తర్వాత సురేందర్ రెడ్డి స్టార్ హీరోలతో సినిమా చేయాలని అనుకున్నాడు. కాని అఖిల్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. తప్పకుండా ఈ సినిమా అక్కినేని ఫ్యాన్స్ ను ఎక్సయిట్ అయ్యేలా చేస్తుంది.                                                             

మరింత సమాచారం తెలుసుకోండి: