మురళీ మోహన్  కంస్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ రంగాల్లో అగ్రపథాన దూసుకెళ్తున్న విషయం అందరికి తెలిసిందే. జయభేరి సంస్థ పెట్టి ఎన్నో నిర్మాణాలు చేపడుతూ, కోట్ల ఆస్తులను కూడగడుతునాన్డు మురళీ మోహన్. అయితే హైదరాబాద్ లో ఒక విలాసవంతమైన 14 ఫ్లోర్ల అపార్ట్మెంట్ కట్టి దాంట్లో మురళీ మోహన్  ఉంటున్నాడు. దాంట్లో ఒకే రకమైన మూడు ఇళ్లను రెడీ చేయించిన మురళీ మోహన్, ఒక ఇంట్లో తాను ఉంటుండగా, ఒక దాంట్లో అయన తమ్ముడు ఉంటున్నాడు. ఇక చివరి ఇంటిని మురళీ మోహన్ తన కొడుకు కోసం తయారు చేయించాడు. ఈ మూడు ఇల్లు ఒకే రకంగా ఉంటాయి. అలాగే అత్యంత విలాసవంతగాను, అత్యాధునిక సదుపాయాలు కలిగి ఉన్నాయికొడుకు కోసం మురళీ మోహన్  ప్రేమగా కట్టించిన ఇంట్లో సామ్-చై ఎందుకు ఉంటున్నారు. మురళీ మోహన్ కొడుకు కోసం కట్టిన ఇంటిని చూసి ఫిదా అయ్యి, తనకు ఆ ఇల్లు అమ్మమని మురళీ మోహన్  ని ఎందుకు అడిగాడు. ఆ ఇంటి గొప్పతనం ఏంటి. స్విమ్మింగ్ పూల్, జిమ్, లైబ్రరీ వంటి అన్ని సౌకర్యాలను కలిగి ఉన్న ఆ ఇల్లు అంటే మురళీ మోహన్  కి చాలా ఇష్టం.

నాగ చైతన్య సమంత ల కొత్త కాపురం

ఇక అదే సమయం లో నాగ చైతన్య సమంత కొత్తగా పెళ్లి చేసుకొని కాపురం పెట్టడానికి మంచి ఇంటి కోసం చూస్తున్నారట. నాగార్జున చాల ఇళ్లను చూపించిన అందులో ఏది నాగ చైతన్య కు నచ్చలేదట. వాస్తు బాగుంటే లైటింగ్ ప్రాబ్లెమ్, విశాలంగా ఉంటె వాస్తు ప్రోబ్లం అని ఎదో ఒక వంక పెట్టేవాడట చై. ఇక విసుగొచ్చిన నాగార్జున సైతం వదిలేసాడట. సరిగ్గా అదే సమయంలో జయభేరి సంస్థలో మురళీ మోహన్ ఉండే ఇంటి కింద పోర్షన్స్ ని ఒకసారి చూడమని నాగార్జునకి సలహా ఇచ్చారట మురళీ మోహన్. నాగ చైతన్య మురళీ మోహన్  కొడుకు కోసం కట్టిన ఇంటిని చూసి ఫిదా అయ్యి, తనకు ఆ ఇల్లు అమ్మమని మురళీ మోహన్ ని అడిగాడట. కానీ ఇవి అమ్మడం కోసం కట్టినవి కావని ఫ్యామిలీ కోసం చేయించానని చెప్పిన నాగ చైతన్య వినలేదట. ఇదే విషయం వెళ్లి నాగార్జున తో చెప్పగా అయన మురళీ మోహన్ కి ఫోన్ చేసి మా వాడికి ఎన్ని ఇల్లు చుసిన నచ్చలేదని, వాడికి ఆ ఇల్లు ఇవ్వండి ఎంత డబ్బైనా పర్వాలేదు అని చెప్పగా, మురళీ మోహన్ ఒప్పుకున్నారట. ఇలా మురళీ మోహన్ కట్టుకున్న ఇంట్లో ప్రస్తుతం నాగ చైతన్య సమంత కొత్త కాపురం పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: