ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇటీవలే మొదలవ్వగా, ఈ చిత్రాన్ని ఓమ్ రౌత్ నిర్మిస్తున్నారు. వరస ఫ్యాన్ ఇండియా సినిమాలతో ప్రభాస్ షెడ్యూల్ అత్యంత క్లిష్టంగా ఉన్న నేపథ్యంలో అయన కాల్షీట్స్ కోసం నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఇది ఇలా ఉండగా సమంత ఇటీవల 'ఆహా' వారి కోసం సామ్ జామ్ అంటూ ఒక షోని హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాక్ షో కి కేవలం పెద్ద స్టార్స్ మాత్రమే వస్తూ వారి మనసులో విషయాలను బయటపెడుతున్నారు. అయితే సమంత కి ఇప్పుడు ప్రభాస్ ఒక షాక్ ఇచ్చారట.
సమంత సామ్ జామ్ టాక్ షో కోసం ప్రభాస్ పాల్గొనాలని ఆహా టీం భావించి ఆయనను సంప్రదించగా, దానిని ప్రభాస్ సున్నితంగా పక్కన పెట్టారట. గతంలో కాఫీ విత్ కరణ్ టాక్ షోలో ప్రభాస్ పాల్గొన్నాడు. ఈ షో సమయంలో ప్రభాస్ ని కరణ్ అనుష్క తో అఫైర్ గురించి అడగడంతో మన రెబల్ స్టార్ కాస్త కంగారు పడ్డాడట. అందుకే ఆ షో తర్వాత మరొక టాక్ షో చేయకూడదని నిర్ణయించుకున్నాడట. అందుకే సమంత షో కోసం ప్రభాస్ పాల్గొనడం లేదట.