టాలీవుడ్ సినిమా పరిశ్రమకి దిల్ రాజు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఆర్య సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు సుకుమార్. అంతకముందు మ్యాథ్స్ లెక్చరర్ గా పనిచేసిన సుకుమార్ కి మొదటి నుండి సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండడం, ఆపై మెల్లగా కథలు రాసి, అనంతరం సినిమా పరిశ్రమకు చేరుకోవడం జరిగింది. ఆ విధంగా తొలిసారిగా అల్లు అర్జున్ తో ఆయన తీసిన ఆర్య సినిమా అప్పట్లో మంచి సక్సెస్ కొట్టింది. ఇక ఆ తరువాత రామ్ తో జగడం, అలానే మరొక్కసారి అల్లు అర్జున్ తోనే ఆర్య 2 సినిమాలు తీసిన సుకుమార్ దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్నారు.

నిజానికి జగడం, ఆర్య 2 సినిమాలు ఆశించిన రేంజ్ సక్సెస్ కానప్పటికీ దర్శకుడిగా ప్రేక్షకుల నుండి సుకుమార్ కి మంచి మార్కులు పడ్డాయి. ఇక అక్కడి నుండి వరుసగా అవకాశాలతో కొనసాగిన సుకుమార్, ఇటీవల రామ్ చరణ్ తో తెరకెక్కించిన రంగస్థలం సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్, రష్మిక మందున్న ల కలయికలో ఆయన తీస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు టాక్. లాక్ డౌన్ కి ముందు రెండు షెడ్యూల్స్ జరుపుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ఇటీవల ప్రారంభం అయింది. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే దీని అనంతరం రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేయనున్నారు సుకుమార్. ఇటీవల దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది.

కాగా ఈ సినిమా కథ, కథనాల విషయమై సుకుమార్ ఎంతో జాగ్రత్త వహిస్తున్నారని, ఇప్పటివరకు తన కెరీర్ లో తీయని విధంగా ఒక సరికొత్త జానర్ లో ఈ సినిమాని ఆయన విజయ్ తో తీయనున్నారని అంటున్నారు. ఇప్పటికే దీని కథ, కథనాలు సిద్ధం అయ్యాయని, పుష్ప అనంతరం ఈ సినిమా వచ్చే ఏడాది ఉగాది రోజున ప్రారంభం కానున్నట్లు చెప్తున్నారు. అలానే ఇందులో విజయ్ దేవరకొండ పాత్ర కూడా ఎంతో డిఫరెంట్ గా ఉండడంతో పాటు ఓవరాల్ గా ఈ సినిమా ప్రేక్షకులకు మంచి థ్రిల్ ని కలిగిస్తుందని టాక్. మొత్తంగా చూసుకుంటే రౌడీ హీరో తో చేయబోయే సినిమా విషయమై లెక్కలు మాష్టారు సరికొత్త ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే తొలిసారిగా విజయ్, సుకుమార్ ల కలయికలో ఒక డిఫరెంట్ యాక్షన్ మూవీ ని ఆశించవచ్చని అంటున్నారు విశ్లేషకులు.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: