పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా చేస్తున్న సజ్ఞాతి తెలిసిందే.. ఈ తర్వాత పవన్ కళ్యాణ్ అయ్యప్పనుం కోషియం అనే మలయాళ సినిమా తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు.. ఈ సినిమా దర్శకుడు సాగర్ చంద్ర ఇప్పటికే షూటింగ్ కి అన్ని ఏర్పాట్లు చేయగా పవన్ రాకకోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కరోనా తర్వాత వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో అయన ఇటీవలే జాయిన్ అయ్యారు.. ఈ సినిమా కంప్లీట్ అవగానే అయన ఏకే రీమేక్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారని తెలుస్తుంది.

సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ రీమేక్ హక్కులని పొందగా పవన్ కి భారీ రెమ్యునరేషన్ ఇచ్చి ఈ సినిమా ని చేస్తుంది.. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మరో మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి.. అందులో ముందుగా క్రిష్ సినిమా కాగా ఈ సినిమా కి హీరోయిన్ గా నిధి అగర్వాల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం..ఈ సినిమా  తర్వాత హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలు ఉన్నాయి.. అయితే సురేందర్ రెడ్డి సినిమా ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.  ఇక ఈ సినిమాలే కాకుండా పవన్ కళ్యాణ్ మరో సినిమా కూడా చేసే ఆలోచనలో ఉన్నారట.. అయితే అది జానీ మాస్టర్ దర్శకత్వంలో అని తెలుస్తుంది.. జానీ మాస్టర్ అంటే అందరికి డాన్స్ మాస్టర్ గానే తెలుసు..ఆయన దర్శకత్వం అది కూడా పవన్ కళ్యాణ్ తో అంటే పెద్ద విశేషమే..

డాన్స్ మాస్టర్ లు మెగా ఫోన్ పట్టడం కొత్తేమి కాదు ప్రభుదేవా, అమ్మా రాజశేఖర్ , లారెన్స్ ఇలా చాలామంది డాన్స్ మాస్టర్ గా వచ్చి డైరెక్టర్ అయినవాళ్లే.. ఈ లిస్ట్ లోకి జానీ కూడా చేరాడు.. జానీ చెప్పిన ఒక స్టోరీ లైన్ ఇంటరెస్టింగ్ గా అనిపించడంతో ఫైనల్ వెర్షన్ చేసుకుని రమ్మని అప్పుడు డిసైడ్ చేద్దామని చెప్పి పంపించినట్టు ఫిలింనగర్ టాక్. ఒకపక్క జనసేన కార్యకలాపాలు చేస్తూనే పవన్ ఇలా కథల మీద కథలు వింటూ అందరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇటు సినీ వర్గాలకు అటు రాజకీయ శ్రేణులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పుడున్న బిజీ స్టార్లు ఎవరూ ఇన్నేసి సినిమాలను క్యూలో పెట్టలేదన్న మాట వాస్తవం. ఒక్క పవన్ మాత్రమే ఇలా చేయడం షాకే.

మరింత సమాచారం తెలుసుకోండి: