ఇక ఈ సినిమా కి దర్శకత్వం వివివినాయక్ అందిస్తున్నారు.. టాలీవుడ్ కి బెల్లంకొండ శ్రీనివాస్ ని పరిచయం చేసిన వినాయక్ బాలీవుడ్ లో నూ పరిచయం చేయడం విశేషం.. టాలీవుడ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ అంతంతమాత్రంగానే ఉంది. ఒక తెలుగు హీరో తెలుగు సినిమా ను తెలుగు డైరెక్టర్ తో హిందీ లో రీమేక్ చేయడంలో వారి ఉద్దేశ్యం ఏంటో అర్థం కావట్లేదు.. టాలీవుడ్ లో అల్లుడు శ్రీను సినిమా తో పరిచయమైనా బెల్లంకొండ శ్రీనివాస్ టాప్ హీరోయిన్స్ తో నటించడం మొదటినుంచి అలవాటు చేసుకున్నాడు.
అలా చేశాడు కాబట్టే టాలీవుడ్ లో తొందరగా అందరి దృష్టి ని ఆకట్టుకున్నాడు..ఇప్పుడు అదే ఫార్ములా ను బెల్లంకొండ బాలీవుడ్ లోనూ అప్లై చేయనున్నాడు. పూజ హెగ్డే, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా లాంటి హీరోయిన్లతో నటించిన శ్రీనివాస్ తన బాలీవుడ్ డెబ్యూలో కూడా స్టార్ హీరోయిన్ కావాలనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఏ లిస్ట్ హీరోలతో నటిస్తోన్న కియారా అద్వానీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నారట.. ఈమె టాప్ హీరోలతో నటిస్తూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసే రేంజ్కి క్రేజ్ తెచ్చుకుంది. ఆమెను ఒప్పించాలంటే కచ్చితంగా భారీగా పారితోషికం ఇచ్చి తీరాలి. హీరోయిన్ ల కోసం ఎంతైనా ఇచ్చే బెల్లంకొండ ఈమెను ఏ రేటుకి ఒప్పిస్తాడో చూడాలి.