టాలీవుడ్ లో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న దర్శకుడు సుకుమార్..నిజానికి అయన సినిమాలు కూడా ఎంతో ఇంటలెక్చువల్ గా ఉంటాయి.. ఆయన సినిమాలు అర్థం కావాలంటే కొంత తెలివి ఉంటే తప్పా అర్థం కాదని టాలీవుడ్ లో పేరుంది.. అయితే ప్రేక్షకులకు అర్థం అయ్యే కన్ఫ్యూషన్ సబ్జెక్టు చేస్తూ మంచి హిట్ లే కొట్టాడు.. మొదటినుంచి సుకుమార్ సినిమాలో ఈ ఇంటలిజెన్స్ ను ఎప్పుడు మిస్ అవకుండా చూసుకున్నారు.. అందుకే అయన సినిమాల్లో నటించాలని ప్రతి హీరో అనుకున్నాడు..

ఇటీవలే రంగస్థలం లాంటి క్లీన్ కమర్షియల్ సబ్జెక్టు చేసి రొటీన్ కి భిన్నంగా సినిమా చేసి హిట్ కొట్టాడు.. ఆ హిట్ తో సుకుమార్ రేంజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయినా ఆయనకు వెంటనే సినిమా మాత్రం దొరకలేదు. మహేష్ బాబు తో చేస్తాడనుకున్న ఈ సినిమా ఆగిపోయింది.. దాంతో అల్లు అర్జున్ తో పుష్ప సినిమా ని మొదలుపెట్టాడు..వీరి కాంబో లో గతంలో ఆర్య, ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్ కాగా ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.. ఇక పుష్ప సినిమా షూటింగ్ ఇటీవలే మొదలయ్యింది.. ఈ సినిమా లో అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రలో లారీ డ్రైవర్ గా నటిస్తున్నడగా రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కి ఓ గాసిప్ ఇటీవలే తెగ ప్రచారం జరిగింది.. ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నది ఎవరు అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎంతో మంది పేర్లు విలన్ పాత్రకు పరిశీలిస్తున్నట్లుగా వచ్చాయి. తాజాగా తమిళ స్టార్ హీరో విక్రమ్ ను పుష్పలోని ముఖ్యమైన పాత్ర కోసం ఎంపిక చేశారు అంటూ వార్తలు వచ్చాయి. ఆయన వచ్చే ఏడాది ఆరంభంలో నెల రోజుల పాటు పుష్ప చిత్రీకరణలో పాల్గొనబోతున్నట్లుగా పుకార్లు షికార్లు చేశాయి. ఇది ఒట్టి పుకారు అని తేల్చేసింది నిర్మాణ సంస్థ. మైత్రి మూవీ మేకర్స్ అనఫిషియల్ గా మాట్లాడుతూ ఇప్పటి వరకు పుష్ప కోసం విక్రమ్ తో సంప్రదింపులు జరపలేదు అని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: