పూజా హెగ్డే  కు న్యూస్ మేకర్ గా మారడమంటే ఇష్టమనుకుంట. టంగ్ స్లిప్ అయ్యినందుకు ఒకసారి బాగా బుక్ అయిపోయిన ఈ సుందరి... ఈ సారి తనకు గుర్తింపు తెచ్చిన హీరోని వదిలేసి మరో హీరోకు సోపు వేయడంతో ఓ వర్గం పూజాపై గుర్రుగా ఉంది.

టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న బ్యూటీ... పూజా హెగ్డే. రకుల్, రష్మిక లాంటి హేమా హేమీలను సైడ్ చేసుకుంటూ టాలీవుడ్ టాప్ పొజిషన్ కు దూసుకుపోతుంది. అలాగే కోలీవుడ్ లోనూ ఈ అమ్మడికి మంచి ప్రిఫరెన్స్ దొరుకుతుంది. అలాంటి సమయంలో సౌత్ సినీ పరిశ్రమ గురించి చవకబారు మాటలు మాట్లాడి అక్షింతలు వేయించుకుంది. తెలుగు ప్రేక్షకులకు థైస్, బొడ్డు అందం చూపిస్తే చాలు పెద్దగా నటించనక్కర్లేదు, వారే ఆదరిస్తారు అంటూ వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

తాజాగా పూజా మరోసారి టంగ్ స్లిప్ అయ్యింది. అయితే ఈ సారి ఎన్టీఆర్ మ్యాటర్లో కాస్త ఎక్కువగా రియాక్ట్ అయింది. ఎన్టీఆర్, నా ఎనర్జి లెవల్స్ సేమ్ గా ఉండడంతోనే...అరవింద సమేతలో మా ఇద్దరి మద్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఈ మాట ఎన్టీఆర్ అభిమానులను సంతోష పెట్టిందో  లేదో తెలియదుగానీ తారక్ తో పాటు నాది సేమ్ ఎనర్జీ లెవెల్ అని గొప్పలకు పోవడంతో అమ్మడు ట్రోల్ అయింది.

పూజా హెగ్డే ఇచ్చిన ఈ స్టేట్ మెంట్ తో బన్నీ ఫ్యాన్స్ తెగ ఫీలైపోతున్నారు. పూజాకు తెలుగులో గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చిన సినిమా డిజే. అందులో బన్నీతో జతగా అమ్మడు చేసిన పర్ ఫార్మెన్స్ కు మంచి గుర్తింపు దక్కింది. సినిమా ఫ్లాపైనా ఈ బ్యూటీ నోటెడైంది. మరి అలాంటి ఇమేజ్ తెచ్చిన ఆ సినిమాను వదిలేసి కేవలం తారక్ పేరే చెప్పడం ఎంతవరకు కరెక్ట్ .ఇదే బన్నీ ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ అయ్యేలా చేస్తుంది. చూద్దాం రానున్న రోజుల్లో పూజాకు ఎన్ని సినిమాలొస్తాయో.

మరింత సమాచారం తెలుసుకోండి: