సూపర్ స్టార్ మహేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది కూడా సరిలేరు నీకెవ్వరూ అంటూ మహేష్ బాక్సాఫీస్ మీద చెలరేగిపోయాడు. కరోనా రాకపోయి ఉంటే ఈపాటికి సర్కార్ వారి పాటను థియేటర్లలో దించేసేవాడు. హ్యాపీగా మరో సినిమా షూటింగ్ కూడా చేసుకునేవాడు.

కానీ ఇపుడు సర్కార్ వారి పాట షూటింగ్ కే మహేష్ ఎక్కువ టైం ఇవ్వాల్సివస్తోంది. ఆ తరువాత మహేష్ మరే విధంగానూ గ్యాప్ ఇవ్వకుండా రానున్న కాలంలో జోరుగా సినిమాలు చేసేయాలని ఫిక్స్ అయ్యాడని టాక్. ఎందుకంటే మహేష్ ఇపుడు నాలుగున్నర పదుల వయసుకు వచ్చేశాడు. గట్టిగా చూసుకుంటే ఈ యంగ్, లవ్ లీ క్రేజ్ అయిదారేళ్ళు  ఉంటుంది.

ఆ తరువాత మార్కెట్ కొంత తగ్గినా తగ్గవచ్చు. ఇది సినీ పండితుల మాట కూడా. అందుకే మహేష్ ఇపుడు ఒక్కసారిగా  జోరు పెంచాడు. ప్రతీ సినిమాకు కనీసం ఆరేడు నెలలు మించి కాల్షీట్లు ఇవ్వడం లేదని అంటున్నారు. ఇలాంటి టైం లో రాజమౌళి ప్రాజెక్ట్ కనుక మహేష్ టేకప్ చేస్తే కచ్చితంగా తక్కువలో తక్కువ రెండేళ్ళు అయినా టైం కేటాయించాలి.

మరి మహేష్ దూకుడు చూస్తూంటే ఆ టైం లో మరో నాలుగు సినిమాలు హ్యాపీగా చేసి రిలీజ్ చేసేలా ఉన్నాడు. నిజానికి మహేష్, రాజమౌళి అంటే అతి భారీ  క్రేజీ ప్రాజెక్ట్. కానీ ఇపుడు ఎక్కువ టైం ఆ సినిమా  షూటింగ్ కి మహేష్ ఇవ్వగలడా అన్న దగ్గరే తేడా వస్తోందని అంటున్నారు. ఇక రాజమౌళి చేతిలో ఆర్.ఆర్.ఆర్ ఇంకా ఉంది. అది పూర్తి అయి రిలీజ్ అయ్యేనాటికి 2022 వస్తుందని అంటున్నారు. అప్పటి నుంచి మరో రెండేళ్ళు మహేష్ డేట్స్ ఇవ్వడం అంటే కచ్చితంగా మహేష్ తనకున్న క్రేజ్ కి ఆ కాలమంతా లాక్ చేసినట్లే. అందుకే ఈ కాంబో ఎంతవరకూ వర్కౌట్ అవుతుంది అన్నదే ఇపుడు సినీ పండిట్స్ చర్చగా ఉందిట.

మరింత సమాచారం తెలుసుకోండి: