ప్రభాస్ ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్.. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో రాముడిగా ప్రభాస్ నటిస్తుంటే రావణాసురుడు గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. 3-డీలో రూపొందనున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ - కృష్ణ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.  తెలుగు హిందీ భాషల్లో సినిమా ను నిర్మించి దాదాపు 25 భాషల్లోకి ఈ సినిమా ని డబ్ చేస్తారట..

సీత పాత్ర కోసం పలువురు పేర్లు పరిశీలిస్తున్నారట నిర్మాతలు. ఇప్పటికే ఆ పాత్ర కోసం మహానటి కీర్తి సురేష్ ని పరిశీలిస్తుండగా బాలీవుడ్ నటీమణులు కియారా అద్వానీ, ఊర్వశి రౌతేలాను కూడా సంప్రదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..అయితే చిరావారిగా ఈ అవకాశం కృతి సనన్ కి దక్కిందని తాజా సమాచారం.సీత పాత్ర‌లో ఆమె ఎంపిక దాదాపుగా ఖాయ‌మైంద‌ని చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే.. ఓం రౌత్ మ‌రో త‌ప్ప‌ట‌డుగు వేశాడ‌నిపిస్తుంది. ఎందుకంటే.. కృతి స‌న‌న్ ఫ్లాప్ హీరోయిన్‌. త‌ను చేసిన సినిమాలన్నీ ఫ్లాపే. తెలుగులో కృతిని ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. పోనీ.. నార్త్ లో వెలిగిపోతోందా అంటే అదీ లేదు. ఓ ప‌క్క‌… ప్ర‌భాస్ కోసం బ‌డా హీరోయిన్లు దిగి వ‌స్తున్నారు. ఇలాంటి టైం లో ఆమెను ఎంపిక చేయడం ప్రభాస్ ఫాన్స్ కి ఏమాత్రం రుచించడంలేదు.

ఇక ప్రభాస్సినిమా కంటే ముందు రెండు సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. ఒకటి రాధేశ్యామ్ కాగా మరొకటి నాగ్ అశ్విన్ దర్శకత్వంలోని సినిమా.. రాధే శ్యామ్  సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.నాగ్ అశ్విన్, ప్రభాస్ సినిమాలో దీపికా పదుకొనె నటిస్తుండగా అశ్వని దత్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రాధేశ్యామ్ సినిమా పూర్తి కాగానే సెట్స్ మీదకు వెళ్తుండగా ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుండడం విశేషం..

మరింత సమాచారం తెలుసుకోండి: