ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...కన్నడ సినిమా పరిశ్రమ చాలా చిన్న పరిశ్రమ. ఒకప్పుడు చాలా సాదాసీదాగా ఉండేవి. కన్నడ సినిమాలకు అంత మార్కెట్ ఉండేది కాదు కాబట్టి భారీ బడ్జెట్ చిత్రాలు వచ్చేవి కాదు. కానీ ఎవరూ ఊహించని విధంగా హోంబలే ఫిలింస్ నిర్మాణ సంస్థ వచ్చిన తరవాత లెక్కలు మారాయి. భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో క్వాలిటీ చిత్రాల‌ను నిర్మించి కన్నడ సినీ పరిశ్రమ‌ను నెక్స్ట్ లెవెల్ కి  తీసుకెళ్లారు.


హోంబ‌లే ఫిలింస్ నిర్మాణ సంస్థ అధినేత విజ‌య్ కిర‌గందూర్‌. క‌న్నడలో  స్టార్  స్టార్స్  పునీత్  రాజ్‌కుమార్‌తో ‘నినింద‌లే’, య‌ష్‌తో ‘మాస్టర్ పీస్‌’ వంటి సూప‌ర్‌ డూప‌ర్ హిట్ చిత్రాల‌ను రూపొందించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. త‌ర్వాత పునీత్ రాజ్‌కుమార్‌తో చేసిన ‘రాజ‌కుమార‌’ చిత్రం అక్కడ ఇండస్ట్రీ హిట్ అయ్యి హ‌య్యస్ట్ గ్రాసర్‌గా నిలిచి శాండిల్‌వుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థగా హోంబ‌లే ఫిలింస్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఇక య‌ష్‌తో చేసిన భారీ బడ్జెట్‌ మూవీ ‘కె.జి.య‌ఫ్ చాప్టర్‌1’తో బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసి పాన్ ఇండియా నిర్మాణ సంస్థగా హోంబ‌లే ఫిలింస్ త‌న మార్క్‌ను క్రియేట్ చేసింది.


ఇప్పుడు వీరి  నిర్మాణంలో రూపొందుతోన్న మ‌రో పాన్ ఇండియా మూవీ ‘కె.జి.య‌ఫ్ చాప్టర్ 2’ విడుద‌లకు సిద్ధంగా వుంది. ఇదిలా ఉండగా వీరు ఇప్పుడు మ‌రో పాన్ ఇండియా మూవీని తెరకెక్కించడానికి  స‌న్నాహాలు చేస్తోంది.ఈ విషయాన్ని నిర్మాత విజయ్ కిరగందూర్ మీడియాకు వెల్లడించారు.వాళ్ళ బ్యానర్లో  మూడో పాన్ ఇండియా సినిమాను రూపొందిస్తున్నారట. భార‌తీయ భాష‌ల‌న్నింటిలో రూపొంద‌నున్న ఈ సినిమా టైటిల్‌, న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాల‌ను డిసెంబ‌ర్ 2న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల 9 నిమిషాల‌కు తెలియ‌జేస్తారని విజయ్ కిరాగందూర్ చెప్పారు.ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: