బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్.. ప్రస్తుతం వరస అవకాశాలతో బిజీ బిజీగా మారిపోయాడు. రాధాకృష్ణ డైరెక్షన్లో 'రాధే శ్యామ్' సినిమాలో నటిస్తున్న ప్రభాస్.. ఆ సినిమా పూర్తయిన వెంటనే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ డైరెక్షన్లో 'ఆదిపురుష్' అనే సినిమాను చేస్తున్నాడు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇటీవలే ఇచ్చింది చిత్ర యూనిట్.  సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.  భారతీయ పురాణం, ఇతిహాసమైన రామాయణం ఆధారంగా ఈ సినిమాని తీయనున్నారు.ఇందులో ప్రభాస్ రాముని పాత్రలో కనిపించి అభిమానులను అలరించనున్నాడు.

అంతేకాకుండా ఈ సినిమా యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇండియన్ సినిమాని మరో లెవల్ కి తీసుకెళ్లే కాంబో ఇదన్న ప్రచారం హీటెక్కిస్తోంది. బాహుబలి తర్వాత మళ్లీ అంతకుమించిన ప్రయత్నం చేస్తున్నారా? అంటూ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.ప్రస్తుతం ఆదిపురుష్ 3డి ప్రీప్రొడక్షన్ వర్క్ సహా కాస్టింగ్ ఎంపికలో బిజీగా ఉన్న ఓంరౌత్ ఇంకా చాలా పనుల్ని వేగంగా పూర్తి చేసి జనవరి నుంచి సెట్స్ కెళ్లాలనే పంతంతో ఉన్నాడట.ఇప్పటికే శ్రీరాముడిగా ప్రభాస్ .. రావణుడిగా సైఫ్ ఖాన్ ని ఫైనల్ చేసేశాడు. సీతగా కృతి సనోన్.. లక్ష్మణుడిగా సోనుకి టిటు కీ స్వీటీ ఫేం సన్నీ సింగ్ నటిస్తారని గుసగుసలు ఆసక్తిని పెంచాయి.ఇప్పటికే లక్ష్మణుడు పాత్రధారి సన్నీ సింగ్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

 అదంతా సరే కానీ.. రామాయణం స్ఫూర్తితో తెరకెక్కనున్న ఈ మూవీలో అత్యంత కీలకమైన ఆంజనేయుడి పాత్ర ఉంటుందా? ఉంటే ఆ పాత్రలో ఎవరు నటిస్తారు? వాలి సుగ్రీవుల పాత్రలు ఉంటే వాటికి ఎవరిని ఎంపిక చేస్తారు? లంకేయుని సోదరి శూర్పణఖగా ఎవరు నటిస్తారు? అన్నవి కూడా ఆసక్తికరంగా మారాయి..ఒకవేళ ఈ సినిమాలో ఆంజనేయడి పాత్ర ఉంటే కచ్చితంగా ఒక స్టార్ హీరోతో ఈ పాత్రను ఎంచుకునే అవకాశం ఉందననే వాదన వినిపిస్తోంది ఫిల్మ్ నగర్ లో.ఎందుకంటే రామాయణం లో ఆంజనేయుడి పాత్ర కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాబట్టి కచ్చితంగా ఈ పాత్రలో ఓ అగ్ర హీరో నటిస్తాడని తెలుస్తోంది. మరి దీనిపై మూవీ టీమ్ ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: