బాబు మోహన్ జగన్ గురించి మాట్లాడుతూ.." జగన్ మోహన్ రెడ్డి దేశంలోనే నెంబర్ వన్ సియం. అద్భుతంగా పాలిస్తున్నాడు. పెన్షన్ల విధానంలో మార్పులు తీసుకువచ్చి వాలంటీర్స్ని పెట్టుకున్నాడు. గ్రామ సచివాలయాలు అంటూ సేవకుల్ని పెట్టుకున్నారు. వాలంటీర్లు ఇంటికి వెళ్లి మరీ పెన్షన్లు ఇస్తున్నారు.కరోనా సమయంలో ఊరు ఊరికీ పోయి టెస్ట్లు చేయించాడు.. ప్రత్యేక వాహనాలు పెట్టాడు. జగన్ పిల్లాడు.. రాజకీయ అనుభవం లేదు.. తండ్రి చాటు బిడ్డ జగన్. అయినా అద్భుతంగా చేశాడు. తెలంగాణ ముఖ్యమంత్రి అడ్రసే లేదు. ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఫ్రెండ్సే కదా.. కరోనా టైంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టెస్ట్ల విషయంలో బ్రహ్మాండంగా చేశాడని ప్రధానమంత్రి మెచ్చుకున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకంటే కరోనా విషయంలో అద్భుతంగా చేశారని నెంబర్ వన్ సీఎం జగన్ అని ఆయనకు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు.
కేసీఆర్ కి లాస్ట్ ర్యాంక్ ఇచ్చారు. ఈయన ఊ అంటే ప్రధానిని మారుస్తా అంటాడు.. ఏం మారుస్తాడే ఏమో ఈయన చేతుల్లో ఏముందో.. మొన్న జనం మార్చేవారే కానీ కొద్దిలో పోయింది. రేపటి ఎన్నికల్లో తెలుస్తోంది.. ఈయన్ని మారుస్తాడా.. జనమే మారుస్తాడా అన్నది.మహానుభావుడు ఎన్టీఆర్ ఏమన్నాడు.. ప్రజలే దేవుడు అన్నారు.. కేసీఆర్కి మాత్రం డబ్బున్నోడే దేవుడు. పేదోడంటే అడ్రస్ ఉండదు. దళితులు అంటే లెక్కే ఉండదు. చిన్నవాళ్లు అంటే అసలు ప్రజలే కానట్టుగా ఉంటారు. ఎన్టీఆర్ లాంటి మహానుభావుడు ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం అన్నాడు. కానీ కేసీఆర్కి జనం కాదు డబ్బున్నోడే దేవుడు" అంటూ జగన్ ని పొగడ్తలతో ముంచెత్తాడు.ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి....