నిజంగానే ఇది అరుదైన, అమితాసక్తిని కలిగించే కాంభినేషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ "అమ్మాయి-ఇక్కడ అబ్బాయి" సినిమాతో వెండితెరకు పరిచయమైన పవన్ కళ్యాణ్.. తమ్ముడు, బద్రి, ఖుషి వంటి సినిమాలతో పవర్ స్టార్గా ఎదిగారు. జానీ, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ వంటి సినిమాలతో బాక్సాఫీఫ్ రికార్డులను తిరగరాశారు పవర్ స్టార్. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లోనూ ఆయన అభిమానులను సంపాదించుకున్నారు.
ఇక పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన చిరుత సినిమా ద్వారా వెండితెరకు పరిచయమై.. ఆ తరువాత తెలుగు ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన సినిమాలతో అగ్రకథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మెగాపవర్ స్టార్ రామ్చరణ్. కథానాయకుడిగానే కాకుండా "కొణిదెలా ప్రొడక్షన్ కంపెనీ"ని స్థాపించి నిర్మాతగా మారి సినిమాలు కూడా తీస్తున్నారు చరణ్. ఇక టాలీవుడు యంగ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చాలా సినిమాలకు అద్దిరిపోయే స్టెప్పులు అందించి మంచి క్రేజ్ సంపాదించుకుని టాప్ డాన్స్ మాస్టర్గా కొనసాగుతున్నారు.
ఇలా తెలుగు ఇండస్ట్రీలో అగ్ర స్థానంలో కొనసాగుతున్న ముగ్గురు సెలబ్రిటీలు కలిసి ఒక సినిమా చేయబోతున్నారని చాలా రోజులుగా సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే, ఈ ప్రాజెక్టును గురించి వీరిలో ఎవరు కూడా ఇప్పటివరకూ అఫీషియల్ గా ప్రకటించలేదు. కానీ ఇటివలే ఈ కాంభినేషన్ ఓకే అయినట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన కథను ఇటీవలే జానీ మాస్టర్.. పవన్ కు వినిపించారట. స్టోరీ బాగుందని పవన్.. ఈ ప్రోజెక్టుకు ఒకే చెప్పారట. మరో ఆసక్తికరమైన విషయమేంటంటే.. జానీ మాస్టర్ డైరెక్షన్, పవన్ హీరోగా నటించనున్న ఈ సినిమాను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించనున్నారట. అతి త్వరలోనే అధికారికంగా ఈ చిత్ర విషయాలను వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. ఇదే గనక నిజమైతే.. మరో మెగా పవర్ బ్లాక్ బ్లస్టర్ వెండితెరపై ఆవిష్కృతం కానుందని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.