సూపర్ స్టార్ మహేష్ బాబు గీతా గోవిందం దర్శకుడు పరశురామ్ పెట్ల ల కాంబినేషన్ లో తెరకెక్కనున్న తాజా సినిమా సర్కారు వారి పాట. అతిత్వరలో అమెరికాలో ఈ సినిమా తొలి షెడ్యూల్ జరగనున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల మహేష్ బాబు జన్మదినం సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు ప్రేక్షకాభిమానుల నుంచి మంచి స్పందన లభించింది.

తొలిసారిగా సూపర్ స్టార్ కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా మది ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాపై అటు సూపర్ స్టార్ ఫాన్స్ తో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాకి తమన్ అదిరిపోయే ఐదు ట్యూన్స్ సిద్ధం చేశాడని అలానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మరో రేంజ్ లో ఉండనుందని టాక్. మరోవైపు ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ లు ఎంతో భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

అమెరికాలో తొలి షెడ్యూల్ ఏకధాటిగా 80 శాతం వరకు జరుగుతుందని ఆ తర్వాత ఇండియాకి తిరిగి వచ్చిన మూవీ యూనిట్ మిగతా భాగాన్ని హైదరాబాదులో చిత్రీకరిస్తారని అంటున్నారు. ఇకపోతే ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాలో మైండ్ బ్లాక్ మాస్ సాంగ్ ద్వారా ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించిన సూపర్ స్టార్ అతి త్వరలో ఈ సర్కారు వారి పాట సినిమాలో ఫ్యాన్స్ కోసం ఒక ప్రత్యేక గీతాన్ని సిద్ధం చేస్తున్నట్లు టాక్. ఇక ఈ ప్రత్యేక ఐటమ్ సాంగ్ కోసం ఒక బాలీవుడ్ బ్యూటీ మహేష్ తో కలిసి ఆడిపాడనుందని అలానే ఈ పాట థియేటర్స్ లో అదిరి పోవటం ఖాయమని సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారమవుతోన్న ఈ వార్త నిజమే అయితే ఇది నిజంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి పెద్ద పండుగ వార్తే అని చెప్పక తప్పదు.....!!



మరింత సమాచారం తెలుసుకోండి: