తెలుగు అగ్ర హీరో మహేష్ బాబు పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..సూపర్ స్టార్ కృష్ణ వారసుడుగా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన ఈ అబ్బాయి.. చిన్నతనంలోనే ఎన్నో అవార్డులను అందుకున్నాడు..యువరాజ్ సినిమా ద్వారా హీరోగా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఆ తర్వాత వరుస హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా ఎదిగాడు..ఇకపోతే మహేష్ స్టార్ హీరో నుంచి సూపర్ స్టార్ గా ఎదిగాడు. తన అందంతో ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు.. కాగా తన 25 వ సినిమా నుంచి వరుస హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. 


ఇటీవల విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా సరిలేరు నికేవ్వరు.. సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమా చేయబోతున్నారు.ఆ సినిమానే సర్కారు వారి పాట.. గీతాగోవిందం ఫేమ్ పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ జోడీగా నటిస్తోంది..చిత్రీకరణలో బిజీగా ఉన్నా ఈ సినిమా వచ్చే ఏడాది ఉగాదికి విడుదల కానుంది..ఇకపోతే మహేష్ బాబు సేవా కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా పాల్గొంటున్నారు.. పేదలకు లేదనకుండా సాయం చేసి పెద్ద మనసును చాటుకున్నాడు.. 



ఇప్పుడు మరోసారి ప్రజల చేత ప్రశంసలు అందుకున్నారు.. ఓ చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టాడు. వివరాల్లోకి వెళితే.. తాజాగా ఏపీకి చెందిన డింపుల్ అనే చిన్నారి వైద్య ఖర్చులన్నీ మహేశ్ బాబు భరించారు. ఆ చిన్నారికి అరుదైన కాల్సిఫైడ్ పల్మనరీ వాల్వ్ అనే వ్యాధి వచ్చింది.. ఆ వ్యాధి నయం అవ్వాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది...ఈ విషయం మహేష్ బాబు దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించిన మహేష్ చిన్నారి ఆసుపత్రికి కావలసిన ఖర్చులను భరించాడు..ఆ చిన్నారి ఎప్పుడు సంతోషంగా ఉండాలని నమ్రత శిరోద్కర్ తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ .. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.. మహేష్ ఫ్యాన్స్ మహేష్ చేసిన గొప్ప పనికి మెచ్చుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: