రాజా ది గ్రేట్ తర్వాత హిట్ కోసం తపిస్తున్న మాస్ మహ రాజ్ రవితేజ ప్రస్తుతం క్రాక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సినిమా తర్వాత రమేష్ వర్మ డైరక్షన్ లో రవితేజ సినిమా వస్తుంది. ఇదే కాదు మాస్ రాజా మారుతి కాంబో సినిమా కూడా ఉంటుందని అన్నారు. కాని అది వర్క్ అవుట్ అయ్యేలా లేదని తెలుస్తుంది.

మరుతి డైరక్షన్ లో సినిమాకు నిర్మాతలను రవితేజ రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేస్తున్నాడని తెలుస్తుంది. తను అడిగిన రెమ్యునరేషన్ ఇస్తా అంటేనే ఆ సినిమా చేస్తానని అంటున్నాడట రవితేజ. అందుకు నిర్మాతలు ఆలోచనలో పడ్డారని టాక్. సో మొత్తానికి రవితేజ మారుతి సినిమా డైలమాలో పడ్డదట.

రవితేజ సినిమా కాదంటే మరో హీరోతో మారుతి సినిమా ప్లాన్ చేసుకుంటాడని తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ ప్రతిరోజూ పండుగే సినిమాతో హిట్ అందుకున్న మారుతి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథని రెడీ చేసుకున్నాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. అయితే హీరోగా రవితేజ చేస్తాడా లేక అతని ప్లేస్ లో ఎవరైనా రీప్లేస్ అవుతారా అన్నది చూడాలి.  మారుతితో సినిమా అంటే మినిమం గ్యారెంటీ హిట్ అన్నట్టే మరి అలాంటి ఛాన్స్ మిస్ చేసుకుంటే రవితేజ పెద్ద మిస్టేక్ చేసినట్టే అవుతుంది.                                                                       

మరింత సమాచారం తెలుసుకోండి: