తెలుగు, తమిళ్లో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న
హీరో సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్.. ఎన్నో సినిమాలలో నటించిన
రజినీ స్టార్ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇప్పటికీ హీరోగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఈయన సినిమాలతో పాటుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు సొంతంగా
పార్టీ కూడా పెడుతున్నాడని వార్తలు
టాలీవుడ్ ,
కోలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. కాగా, ఈరోజు
రజినీ అభిమాన సంఘాల నాయకులతో చెన్నైలోని
రాఘవేంద్ర కళ్యాణ మండపంలో
రజినీ సమావేశమయ్యారు. రజనీ మక్కళ్ మండ్రం నిర్వాహకులతో సమావేశం తర్వాత నేరుగా తన నివాసం పోయెస్ గార్డెన్కు చేరుకున్న రజినీ.. మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా రాజకీయ ప్రవేశంపై వీలైనంత తర్వగా నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు. మక్కళ మండ్రం సభ్యులతో తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు..
పార్టీ, పొలిటికల్ ఎంట్రీ పై
సూపర్ స్టార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.2021 కల్లా తన పార్టీని ప్రకటించబోతున్నారని ఆయన అంతరంగికులు పేర్కొన్నారు.
పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రజనీకాంతే ముందుకు రాబోతున్నారని తెలిపారు. అభిమాన సంఘాల నుంచి అభిప్రాయాలను తీసుకున్న అనంతరం ఏ విషయమైనా చెప్తానని
రజినీ అన్నారు.
ఇకపోతే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం బాగాలేదని చెబుతున్నారు.డయాలసిస్ పేషెంట్ అయిన రజనీకాంత్ ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో బయట తిరగడం ఆయన ఆరోగ్యానికి ముప్పని డాక్టర్లు చెప్పినట్లు ఆ లేఖలో ఉంది. ఈ
లేఖ సోషల్మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన రజనీ.. సరైన సమయంలో రాజకీయ ప్రవేశంపై నిర్ణయం తీసుకుంటానని అభిమానులకు హామీ ఇచ్చారు.అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. ప్రస్తుతం
రజినీ రెండు మూడు సినిమాలలో నటిస్తున్నారు.. వచ్చే ఏడాదిలో ఆ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ విషయం అయితే ఆయన అభిమానులకు మింగుడు పడలేదని తెలుస్తుంది..