అక్కడే తన చదువు పూర్తి చేసింది. తను చిన్నప్పుడు సింగర్ కావాలనుకునేది అంటా.. కానీ పెరుగుతున్న కొద్ది చదువుపై ఆసక్తి పెరిగి ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంది. అలా తను చదువు అయిపోగానే ప్రకటనలకు కాపీ రైటర్ గా పని చేసింది. ఆ తర్వాత రాశీకి ప్రకటనల్లో నటించే అవకాశం వచ్చింది. అది ఆమెను పూర్తిగా మార్చేసింది.
ఇక ప్రకటనల గుర్తింపుతో రాశీకి 2013లో హిందీ సినిమా మాద్రాస్ కేఫ్ లో అవకాశం వచ్చింది. ఈ సినిమా రూ. 100 కోట్ల మార్క్ ను దాటడంతో ఆమెకు కలిసి వచ్చింది. ఈ సినిమాను చూసి ఊహలు గుసగుసలాడే లో తనని హీరోయిన్ గా పెట్టారు. అది కూడా తనకు మంచి మార్కులు తెచ్చిపెట్టింది. ఇలా స్టార్ట్ అయిన తన కెరీర్.. దూసుకుపోయింది. వరుస సినిమాలతో బిజీగా ఉండేలా చేసింది. జోరు, జిల్, శివమ్, బెంగాల్ టైగర్ ఇలా పలు చిత్రాల్లో నటిస్తూ విజయాలను సొంతం చేసుకుంది.
అయితే రాశీ 2018 కోలీవుడ్కు పరిచయం అయ్యింది. అక్కడ కూడా వరుస సినిమాలతో విజయం సాధించింది. వెంకీ మామ, ప్రతిరోజూ పండగే సినిమాలు మరింత పేరు తెచ్చిపెట్టాయి తనకు. ఇప్పుడు రాశీ చేతిలో నాలుగు కోలీవుడ్ సినిమాలు ఉన్నాయని సమాచారం.అయితే రాశీ సినిమాల్లోకి రావడానికి ముందు మోడలింగ్, యాక్టింగ్పై ఏ మాత్రం ఆసక్తి ఉండేది కాదంటా..తను చదువుకునే రోజుల్లో ప్రేమలో పడిందంటా.. కానీ అది విఫలమైందట. ఇలాంటి పలు విషయాలను ఆమె ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది.